కాని కాలం జాతీయోద్యమ కవుల పక్షానే నిలిచింది. తర్వాత రోజుల్లో తిరిగి మళ్ళా ప్రజలు తమ సాంఘిక, రాజకీయ అసంతృప్తిని, అసమ్మతిని ప్రకటించడానికి గరిమెళ్ళ బాటనే పట్టారు. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండులు మొదలుకుని గద్దర్ దాకా కూడా ఒక అవిచ్ఛిన్న గేయకారపరంపర కొనసాగుతూ వస్తున్నదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు