ఆ వెన్నెల రాత్రులు

ఎప్పుడో 1987 లో మొదలుపెట్టిన నవల. రెండేళ్ళ కిందట పూర్తిచేయగలిగాను. అప్పణ్ణుంచీ ప్రచురిద్దామనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. అందుకని ఈ వసంతపూర్ణిమ నాడు ఈ పుస్తకాన్నిట్లా మీ చేతుల్లో పెడుతున్నాను. ఇది నా 60 వ పుస్తకం. ఎప్పట్లానే ఈ పుస్తకాన్ని కూడా మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను.

అరణ్యం

వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన అరణ్యం నవలని నండూరి రామ్మోహనరావుగారు ఆంధ్రజ్యోతి దినపత్రికలొ డెయిలీ సీరియల్ గా ప్రచురించారు.