‘పూలపాన్పులు ఎన్నో ఉండగా, శంభూ, నువ్వీ శిలాతలాల్లోనే ఎందుకు నాట్యం చేస్తావు?’ అన్నాడు కవి. ఈ సొరంగాల్నీ, బయటకు తవ్వి తీసిన ఈ పందొమ్మిదిలక్షల టన్నుల మట్టినీ చూస్తుంటే పరమశివుని శిలాతలనాట్యంలోని సౌందర్యం, ప్రయోజనం ఎంత చక్కగా బోధపడుతున్నాయి!
నేను తిరిగిన దారులు-7
ఆ క్షణాన మాకు ‘అకృతాత్ములకు శిలానికరమై తోచు, సుకృతాత్ములకు లింగనికరమై తోచు’ అని శ్రీపర్వత సముదాయం గురించి కవి చెప్పిన మాట గుర్తొచ్చింది.
ప్రత్యూష పవనాలు
ప్రత్యూష పవనాలు చిన్న పుస్తకం. కొందరు మహాత్ముల రచనలనుంచి ఏరి కూర్చిన కొన్ని వాక్యాలు. 1996 లో వెలువరించిన ఈ పుస్తకం ఇప్పుడు ఎక్కడా లభ్యంగా లేదు. కొత్తగూడెం కి చెందిన కిరణ్ గారి పుణ్యమా అని అప్పటి పుస్తకం పిడిఎఫ్ ఒకటి దొరికింది. దాన్ని ఇలా లే ఔట్ మార్చి రెండో ముద్రణగా మీతో పంచుకుంటున్నాను. మంచిమనిషి వెలమూరి శ్రీరాం స్మృతికి ఈ పుస్తకం అంకితమిస్తున్నాను.
