రావిశాస్త్రి వారసులు

ఈరోజు రావిశాస్త్రి గారి 104వ జయంతి సందర్భంగా—స్వర్ణ కిలారి, నరేష్ కుమార్ సూఫీ, మహమ్మద్ గౌస్, చరణ్ పరిమి గార్లకు ఈ పురస్కారాలను అందజేస్తున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు మొత్తం 15 మంది రచయితలకు ఈ పురస్కార గౌరవం దక్కింది.

నేను తిరిగిన దారులు-11

నేను దార్లపల్లిలో అందెల కన్నపురెడ్డిని అడిగాను: 'నీకు నలుగురితో పాడుకోవడం సంతోషంగా ఉంటుందా, ఒక్కడివే పాడుకోవడం సంతోషంగా ఉంటుందా? అని. అతనన్నాడు కదా, 'నలుగురితో కలిసి పాడుకోవడం పండగ. కానీ, నలుగురితో కలవలేనంత మాత్రాన పాడుకోవడం మానను. మనసుకి సంతోషమైనప్పుడల్లా పాడుకుంటూనే ఉంటాను.'

నేను తిరిగిన దారులు-10

ఆ కొండల్ని అర్థం చేసుకోవడానికి రకరకాల పోలికల కోసం ప్రయత్నించాను. ఆ జలరాశి ఒక సరస్సనీ, ఆ కొండలు పెద్దసరస్సులో నీళ్ళు తాగడానికి వచ్చిన ఏనుగు మందలనీ అనుకోవడం కూడా బాగుంది. అవి నదీవాద్యం పైన నిరంతరంగా వినిపిస్తున్న సంగీత తరంగాలని అనుకోవడం కూడా సంతోషాన్నిచ్చింది.