కిందటి ఏడు నా కవితాసంపుటి 'కోమల నిషాదం' వెలువరించినప్పటినుంచీ ఇప్పటిదాకా రాసిన 62 కవితల్తో ఈ 'జ్యోతిర్మయ రోదసి' వెలువరిస్తున్నాను. ఇది నా తొమ్మిదవ కవితాసంపుటి. 77వ పుస్తకం. ఈ పుస్తకాన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. పుస్తకప్రేమికులు, ఆత్మీయులు కొప్పరపు లక్ష్మీనరసింహారావుగారికి దీన్ని కానుక చేస్తున్నాను.
నేలకొండపల్లి-3
నేలకొండపల్లి వెళ్ళి వచ్చినప్పటినుంచీ ఈ వారం రోజులూ నా ఆలోచనల్లో రామదాసే ఉన్నాడు. రామదాసు కీర్తనల్లో ప్రధానమైంది ఆర్తి. అది ఆయన జైల్లో ఉండగా రాసిన పాటల్లో మరీ మరీ వినిపిస్తుంది. కాని అంతకన్నా ముందటి పాటల్లో ఉండేది ఉత్సాహం.
నేలకొండపల్లి-2
ఆ బావి మీద 'ఈ బావి శ్రీరామదాసుగారు వాడినది' అని రాసి ఉంది. అటువంటి సజీవస్రవంతిని చూడటంలో ఒక పులకింత ఉంది. అయితే ఆయన ప్రవహింపచేసిన కీర్తనాసాహిత్యమనే సుజలస్రవంతిలో ఒక్కసారేనా మునకలెయ్యని తెలుగువాడంటూ ఉండడుకాబట్టి, నేలకొండపల్లిలో ఆయన చేదుకున్న నీళ్ళబావిని చూడటంలో ఒక చిత్రమైన సంతోషముంది.
