నేను తిరిగిన దారులు-11

‘మనోనాశనం, ఆ ఉత్తరాలంతా కనపడుతున్నది చలం తన మనోనాశనం కోసం చేసిన పోరాటమేనయ్యా’ అన్నారాయన. ‘చలం ఒక ఫైర్. మా గురువుగారి (విశ్వనాథ సత్యనారాయణ) గురించి ఆమాట అనలేను’ అనికూడా అన్నారు.

జీవనశిల్పి ఆవిష్కరణ

రవీంద్రకుమార శర్మ గారితో 2010 లో నేను చేసిన సంభాషణల్ని జీవనశిల్పి పేరిట మీతో పంచుకున్నాను. ఆ సంభాషణల్ని పుస్తక రూపంగా కూడా ఈ-బుక్ గా మీతో పంచుకున్నాను. శ్రీపాద లిటరరీ వర్క్స్ వారు ఆ సంభాషణల్ని పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఈ రోజు సాయంకాలం అదిలాబాదులో కళాశ్రమంలో ఆ పుస్తకాన్ని గురూజీ శ్రీమతి రాజశ్రీ శర్మగారు ఆవిష్కరిస్తున్నారు.

రావిశాస్త్రి వారసులు

ఈరోజు రావిశాస్త్రి గారి 104వ జయంతి సందర్భంగా—స్వర్ణ కిలారి, నరేష్ కుమార్ సూఫీ, మహమ్మద్ గౌస్, చరణ్ పరిమి గార్లకు ఈ పురస్కారాలను అందజేస్తున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు మొత్తం 15 మంది రచయితలకు ఈ పురస్కార గౌరవం దక్కింది.