నేను తిరిగిన దారులు-17

ఇక్కడ అనేక శతాబ్దాలుగా అసంఖ్యాకమానవులు తమ జీవితాలను ప్రార్థనాగీతాలుగా, హారతిజ్యోతులుగా మార్చేసుకున్నారు. ఏ అతీతకాలంలో పరమశివుడు పార్వతీదేవి చెవిలో ఏ రహస్యసంభాషణ చేశాడోగాని ఆ రహస్యాన్ని ప్రజాస్వామికం చేయడం కోసమే జ్ఞానేశ్వరుడినుంచి సాయినాథుడిదాకా ఒక ఆధ్యాత్మిక ఉద్యమం కొనసాగుతూ వస్తోందనిపించింది.