అమృత షెర్-గిల్

డిల్లీలో క్రాఫ్ట్స్ మూజియం చూసిన తరువాత,ఆధునిక భారతీయ చిత్రకారులంతా కోరుకునే గమ్యస్థలి, నేషనల్ గాలరీ ఆఫ్ మాడరన్ ఆర్ట్ కూడా చూసాం. రాజస్థాన్ పింక్ స్టోన్ తో కట్టిన జైపూర్ హౌస్ లో అడుగుపెడుతూనే ప్రాంగణంలో మరీ అంత ఆకర్షణీయంగా లేని వింకారోజియా పూలవరసలు. బయట ఎండకి ఎండి వానకి తడుస్తున్నట్టున్న శిల్పాలు.