ఎ. రవీంద్రబాబు సీనియర్ పాత్రికేయులు, కథకులు, సాహిత్యవేత్త. ఆయన నా పుస్తకాలు అయిదింటిపైన చేసిన సమీక్షల్ని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. ప్రపంచ మానవ జీవన చిత్రణ ప్రపంచ కథా సాహిత్యంలో తనను ప్రభావితం చేసిన ఇరవై కథలను ‘నన్ను వెన్నాడే కథలు’గా మన ముందుకు తెచ్చారు చిన వీరభద్రుడు. ఇందులో ప్రతీ కథా వస్తు, శిల్పాలపరంగా వైవిధ్యంతో అక్కడి సమాజాన్ని, సంస్కృతిని, మూలాల్ని, వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. మనిషి స్వభావాన్ని మంచు బిందువులా తాకి చూపిస్తుంది. కమలేశ్వర్ …
నేను తిరిగిన దారులు-13
‘ఇదిగో, ఇదే చలంగారి సమాధి, ఈ మధ్యే మున్సిపాలిటీవాళ్లు రోడ్డు వెడల్పు చేయడంకోసం దీన్ని కొట్టేశారు’ అన్నాడు. అదొక పాడుబడ్డ సిమెంటు కట్టడం. దానిమీద ఆరిపోయిన ప్రమిద ఒకటి ఉంది. ఆ సిమెంటుగోడలు నాచుపట్టి ఉన్నాయి. నాకు విపరీతమైన దుఃఖం ముంచుకొచ్చింది. ఇక్కడ ఈ సమాధి లేకపోతే బావుండేదనిపించింది.
నేను తిరిగిన దారులు-12
ఆ శిఖరాన్ని అట్లా చూస్తున్నకొద్దీ నాలోపల నా జ్ఞాపకాలలోపల ఎన్నో పొరలకిందనుంచి, ఎన్నో వాసనల, సంస్కారాల తెరలు తప్పించుకుంటూ నెమ్మదిగా ఒక మహాశిఖరం తలెత్తుతున్నట్లుగా అనుభవమైంది. నేనిక్కడికి వచ్చింది ఈ శిఖరాన్ని చూడటంకోసమే, అసలు నన్ను చూడటంకోసమే ఈ శిఖరం నన్నిక్కడికి రప్పించుకుందని నాకు హఠాత్తుగా స్ఫురించింది.
