ఆ మందహాసాన్ని ఒక్కసారి చూడటానికేనా

సహ్యాద్రి అంతటా వ్యాపించిన దత్తసంప్రదాయం, పండరిపురం కేంద్రంగా విలసిల్లిన విట్ఠల సంప్రదాయం, సంత్ భక్తి వాగ్గేయకారుల కీర్తన సంప్రదాయం, వార్కరి, మహానుభావ సంప్రదాయం, నాథ సంప్రదాయం, మరొకవైపు దక్కన్ ని వెలిగించిన సూఫీ సంప్రదాయం ఇవ్వన్నీ సాయిబాబాలో సంగమించించాయి.