సారంగపాణి రాసిన పదాల్లో జాతీయ పదాల పేరిట వర్గీకరించినవి ప్రధానంగా ఆనాటి సామాజిక స్థితిగతులకు అద్దం పడతాయి. మరీ ముఖ్యంగా రాయలసీమను కలచివేసిన కరువుకాటకాల యథార్థ చిత్రం ప్రజల భాషలో ఆ పదాల్లో చిత్రణకి వచ్చింది. కరువులో తినడానికి తిండిలేని ఒక రైతు కుటుంబం ఇంటికి ఒక యాచకుడు భిక్షకోసం వచ్చినప్పుడు అతడికి ఏమీ ఇవ్వలేకపోతున్న ఆ తల్లి వేదన చూడండి: ~ కిన్నరవాస్తా నిలబడుకుంటె- గింజలేద్డ దైతం యాడ అన్ని లేవె, యెందొల్లడ బెట్టిన అగిత్తెమ …