నిన్న సాయంకాలం రాజిరెడ్డి ఫోన్ చేసి ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ ఒక రష్యన్ రచయితకి ఇచారని చెప్తూ ఆమె గురించి మీరేమైనా రాయగలరా అనడిగాడు. ఆమె పేరు కూడా చెప్పాడు గాని, ఫోన్లో వినబడలేదు. నేనామె పేరెప్పుడూ వినలేదనీ, ఆమె రచనలగురించేమీ తెలియదనీ సదాశివరావుగారిని గానీ, ముకుందరామారావుగారిని గానీ అడగమని చెప్పాను.