సిద్ధౌషధం

కవిగా ఆయన సర్వోన్నతుడు, కాని మనిషిగా బలహీనుడు, ఎంత మహావిషాదాన్ని చూసినా కూడా తన జీవితేచ్ఛ చల్లారని వాడు. 'పొద్దుటిపూట దీపంలాగా ఏ క్షణాన్నైయినా కొండెక్కేలాగా ఉంది' తన జీవితమని ఒక ఉత్తరంలో రాసుకున్నాడుగాని, ఆ నిశాంతవేళ కూడా సాయంసంధ్యాదీపంలాగా ప్రజ్వరిల్లాలనే తపించాడు.