ఇప్పుడు అనల్ప బుక్ కంపెనీ బలరాం గారు ఆ పుస్తకాన్ని అనల్ప ప్రచురణ కింద మళ్ళీ కొత్తగా వెలువరించారు.
నా చంపారన్ యాత్ర
1917-18 సంవత్సరాల్లో చంపారన్ ప్రాంతంలో గాంధీజీ సత్యాగ్రహం చేపట్టిన ప్రాంతాల్ని వాడ్రేవు చినవీరభద్రుడు ఆగస్టు 2018 లో సందర్శించి రాసిన యాత్రాకథనం. గాంధీజీ సందర్శించిన గ్రామాలు, పట్టణాలతో పాటు, బుద్ధుడి జీవితంతో పెనవేసుకున్న మరికొన్ని ప్రాంతాలను చూడటం కూడా ఈ యాత్రకొక అదనపు ఆకర్షణ.
నేను తిరిగిన దారులు
ఇండియా టుడే తెలుగు పత్రిక కోరికమీద వాడ్రేవు చినవీరభద్రుడు ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన ప్రాంతాలైన అరకులోయ, శ్రీశైలం,భద్రాచలం ప్రాంతాల యాత్రావర్ణనలు రాసారు. ఆ తర్వాత ఇంగ్లాండు సందర్శించినప్పుడు మరొక సమగ్రమైన యాత్రాకథనం వెలువరించారు. ఆ కథనాలకు, మరికొన్ని అనుభవకథనాలు జోడించి 2010 లో వెలువరించిన యాత్రాగ్రంథం 'నేను తిరిగిన దారులు.'
