ఒకప్పుడు ఉజ్జయినిలో ఉదయన పండితులుండేవారని కాళిదాసు గుర్తుచేసుకుంటాడు. సన్నిధానం అటువంటి రాజమండ్రి పండితుడు. దాదాపు వందా, నూట యాభయ్యేళ్ళ రాజమండ్రి సాహిత్య, సాంస్కృతిక చరిత్ర అతడికి కంఠోపాఠం. ఆ ముచ్చట్లు ఆయన చెప్తుంటేనే వినాలి. ఒకప్పటి రాజమండ్రిగురించి మాట్లాడటం మొదలుపెడితే ఆయన మొత్తం దేహంతో మాట్లాడతాడు. మాటమాటకీ గుండె గొంతులోకి ఉబికి వచ్చేస్తుంది.
సాహిత్య జగత్తు
ఆ వ్యాసాల్లో రవీంద్రుడు భారతీయ సహృదయ పరంపరకు ఇరవయ్యవ శతాబ్ది వారసుడిగా కనిపిస్తాడు. ఉప్పెనలాగా విరుచుకుపడ్డ పాశ్చాత్య సభ్యతను అవగాహనకు తెచ్చుకుంటూ ఆ వెలుగులో మన సాహిత్యాన్నీ, మన సాహిత్యం వెలుగులో ఆధునిక జీవితాన్నీ, ఆధునిక సందర్భంలో సాహిత్యకారుల కర్తవ్యాన్నీ తెలుసుకుంటూ చేసిన రచనలవి.
చక్రాల వెంకట సుబ్బుమహేశ్వర్
మా మిత్రుడూ, నాకెంతో ఆత్మీయుడూ మహేష్ నిన్న రాత్రి చెన్నైలో ఈ లోకం వదిలిపెట్టివెళ్ళిపోయాడు. నిన్నసాయంకాలమే సురేష్ బాబు ఫోన్ చేసినప్పుడే నేనీ వార్త వినడానికి మానసికంగా సిద్ధపడిపోయాను. పొద్దున్నే కుప్పిలి పద్మ, కొప్పర్తి, వొమ్మి రమేష్.. రాజమండ్రి మిత్రులంతా ఫోన్ చేస్తూ ఉన్నారు.