అందులో అనుభూతికన్నా, అభిప్రాయప్రకటనకన్నా, పదచిత్రాలకన్నా భిన్నమైందేదో కనిపించింది. ఎంత ప్రయత్నించీ అదేమిటో బోధపరుచుకోలేకపోయాను. ఆ కవితను ఈ నలభయ్యేళ్ళలో వందసార్లేనా చదివి ఉంటాను. కాని ఎప్పటికప్పుడు అది నాకు అందుతూనే అందకుండా జారిపోయేది.
నా చంపారన్ యాత్ర-5
బుద్ధుడు నడయాడిన ప్రతి చోటూ మనకేదో చెప్తూనే ఉంటుంది. ఈసారి నాకు అర్థమయింది, బుద్ధుడికీ, వైశాలికీ మధ్య ఉన్న అనుబంధం లాంటిదే మళ్ళా గాంధీజీకి చంపారన్ కీ మధ్య ఏర్పడిందని.
కాలామ సుత్త
కాలామసుత్త ని 'కేశముత్తియ సుత్త' అని కూడా అంటారు. అది అంగుత్తరనికాయంలో ఉన్న ఒక సంభాషణ. విద్యగురించీ, తెలుసుకోవడం గురించీ, ముఖ్యంగా ఇతరులు చెప్పారన్నదాన్నిబట్టికాక, మనిషి తనకై తాను తెలుసుకోవలసిన అవసరం గురించీ మాట్లాడిన సంభాషణ అది.