బసవ పురాణం-2

పాల్కురికి సోమన రాసిన బసవపురాణంలో ముగ్ధ భక్తుల గురించిన ప్రసంగాల్లో రెండవ రోజు ప్రసంగం బెజ్జమహాదేవి గురించి. వాత్సల్య భక్తికి ఉదాహరణగా కృష్ణ భక్తి సాహిత్యంలో ఒక పెరియాళ్వారు, ఒక సూరదాసు మనకు కనబడతారు. కానీ ఒక తల్లి హృదయంతో శివుని పసిబిడ్డగా భావించి లాలించి పెంచుకున్న ఒక ముగ్ధ మాతృమూర్తి కథ ఇది. భారతీయ భక్తి సాహిత్యం లోనే ఇటువంటి కథ మరొకటి లేదు.