మూడు ఉత్తరాలు

ఇటువంటి స్పందనలు చదివినప్పుడు టాల్ స్టాయి మాటలే గుర్తొస్తాయి. తాను రాసిన అనా కరెనినా నవల మీద తర్వాత కాలంలో వచ్చిన స్పందనల్ని చూసి 'ఈ రచనని ఇంత శ్రద్ధగా చదువుతారని తెలిస్తే, మరింత శ్రద్ధగా రాసి ఉండేవాణ్ణి ' అని. ఇటువంటి ఉత్తరాలు చూసినప్పుడు, ఈ కథలు తమ పాఠకుల్ని ఇలా వెతుక్కోగలవని తెలిసి ఉంటే, మరెన్నో కథలు రాసి ఉండేవాణ్ణి అని అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

కొండాపూర్ లో ఒక మధ్యాహ్నం

కాని, ఇక్కడి పరిస్థితి చూడండి. ఇప్పటికి రెండువేల ఏళ్ళకిందట తెలంగాణాలో ఒక పట్టణం ప్రముఖ్య వ్యాపార కేంద్రంగా విలసిల్లింది. రోమ్ తో సాతవాహనులు నడిపిన వ్యాపారం లో ఆ పట్టణం ఎంత ప్రముఖ పాత్ర పోషించిందంటే అక్కడ ఒక రోమన్ సెటిల్ మెంట్ నే ఏర్పడిందని చరిత్రకారులు చెప్తున్నారు. కాని ఆ ప్రాంతాన్ని చూడటానికి ఇప్ఫుడెవరికీ ఆసక్తి లేదు.

కళింగాన్వేషణ

డా. విజయభాస్కర్‌ కవి, నాటకకర్త కూడా. ఇతిహాసపు చీకటికోణం అట్టడుగున పడి కనిపించని ఎన్నో కథల్ని ఆయన మనముందుకు తీసుకొచ్చారు. ఇప్పటిదాకా అప్రధానీకరణకు గురయిన సమూహాలకు సాహిత్యంలో సముచిత స్థానాన్ని సంపాదించే క్రమంలో ‘రాజిగాడు రాజయ్యాడంట’ పేరిట ఆయన రాసిన నాటకం గొప్ప ప్రయోగం. ఇప్పుడు ఆయన నవలారచయితగా కూడా ఈ నవలతో మనముందుకు వస్తున్నారు.