నిజమైన జీవితాశయం

భారతదేశానికి బుద్ధుడెలాగో, గ్రీసుకి సోక్రటీసెలాగో, చైనాకి కన్ ఫ్యూసియస్ ( క్రీ.పూ. 551-479) అలాగ. గత రెండువేల అయిదువందల చీనా చరిత్రమీదా, సంస్కృతిమీదా ఆయన ముద్ర అపారం.ఇరవయ్యవశతాబ్దిలో ఆయన భావజాలం మీద పెద్ద తిరుగుబాటు చెలరేగింది.

మాటలనియెడు మంత్ర మహిమ

నిన్న నెల్లూరులో కాఫ్లా ఇంటర్ కాంటినెంటల్ వారు నిర్వహించిన తొమ్మిద అంతర్జాతీయ రచయితల ఉత్సవం ప్రారంభోత్సవ సభలో కీలకోపన్యాసం చెయ్యవలసిందిగా నన్ను ఆహ్వానించారు. ఆ ప్రసంగ పాఠం:

పాడిపంటలు పొంగిపొర్లే దారిలో

పన్నెండుమంది ఆళ్వారుల్లో ఒకరైన ఆండాళ్ (క్రీ.శ.9 వశతాబ్ది) రచించిన తిరుప్పావై భారతీయసాహిత్యంలోని అత్యంతవిలువైన కృతుల్లో ఒకటి. తదనంతరసాహిత్యాన్ని అపారంగా ప్రభావితం చేసిన రచన. అక్కమహాదేవి, మీరా, లల్ల, మొల్ల వంటి ప్రాచీనకవయిత్రులతో పాటు సరోజినీనాయుడు, తోరూదత్, మహాదేవీవర్మవంటి ఆధునిక కవయిత్రులదాకా ఎందరో భావుకులకూ, రసపిపాసులకూ, జీవితప్రేమికులకూ ఆండాళ్ దే ఒరవడి.