సి.వి.కృష్ణారావుగారు

కృష్ణారావు గారు 90 వ ఏట అడుగుపెట్టినప్పుడు నేను రాసింది చదివి మీరంతా ఎంతో ఆత్మీయంగా ప్రతిస్పందించారు. ఆ అభిమానం, ఆ స్నేహస్పందన ఆయనకు కొత్త ఉత్సాహాన్నిస్తాయనే అనుకుంటూ, ఈ సారి జూలై 3 న ఆయన 91 వ ఏట అడుగుపెట్టినప్పుడు మళ్ళా ఆయన్ను పలకరించాలనుకున్నాం. అందుకని శుక్రవారం సాయంకాలం, సోమయ్యగారూ, గంగారెడ్డీ, నేనూ కృష్ణారావుగారి ఇంటికి వెళ్ళాం.

హీరాలాల్ మాష్టారు

నిన్న తెల్లవారు జాము నిద్రలో ఎందుకో ఫోన్ తడిమిచూసుకుంటే మెసేజి, విద్యారణ్య కామ్లేకర్ నుంచి, ఏ అర్థరాత్రి ఇచ్చాడో: 'భద్రుడూ, నాన్నగారు ఇక లేరు. 'అని. అది చూసినప్పటినుంచీ, నాలో ఒక పార్శ్వం చచ్చుబడిపోయినట్టే ఉంది.

మోయలేని బాధ్యత

శ్యామలానగర్ మొదటిలైన్లో మూడవ ఇల్లు, వానజల్లు మధ్య ఇంట్లో అడుగుపెడుతూనే రాలుతున్న పారిజాతాలు పలకరించాయి. అత్యంత సుకుమారమైన జీవితానుభవమేదో నాకు పరిచయం కాబోతున్నదనిపించింది.