కరదీపిక

భారతరరాజ్యాంగ రూపకర్తలు గిరిజన ప్రాంతాల్లో 'శాంతి', 'సుపరిపాలన' ఉండాలని కోరుకున్నారు. వాళ్ళ వెనక నూటయాభై ఏళ్ళుగా రక్తంలో తడిసిన గిరిజన ప్రాంతాల జ్ఞాపకాలున్నాయి. 'శాంతి', 'సుపరిపాలన' అనే మాటలు వాడటంలో రాజ్యాంగ రూపకర్తలు ఎంతో వివేకాన్నీ, దూరదృష్టినీ కనపరిచారు.