నా కాశీయాత్ర-2

మంగళవాద్యాల, శంఖతాళాల మధ్య బిగ్గరగా పాడుతున్న హారతిగీతాల మధ్య దేదీప్యమానమైన దీపాల వెలుగు, రంగురంగుల దీపాలు, ఆ దీపకాంతిలో లక్షలాది రంగుల్లో యాత్రీకులు, వారి వదనాలన్నీ నీటిమీద కలిసిపోతున్న నీటిరంగుల్లాగా అలుక్కుపోయి ఆ ఒడ్డంతా ఒక ఇంద్రచాపం పరిచినట్టుగా అనిపించింది.