వాళ్ళు తమ ప్రపంచాన్ని పునర్నిర్మిస్తున్నారు

తెలంగాణా టూరిజం వారు హైదరాబాదు మెట్రొపొలిస్ సందర్భంగా వారం రోజులపాటు చిత్రలేఖన శిబిరం నిర్వహిస్తున్నారు. తారామతి-బారాదరిలో సుమారు 90 మంది తెలంగాణా చిత్రకారులు రెండు విడతలుగా పాల్గొన్న ఈ శిబిరానికి రెండుసార్లు వెళ్ళాను. అంతమంది చిత్రకారులు ఒక్కచోట చేరి వర్ణచిత్రాలు గియ్యడంలో ఏదో గొప్ప శక్తి ఉత్పత్తి అవుతున్నట్టనిపించింది.