మనిషి పుట్టుకతోటే విద్యావంతుడు. కాని ఆ విద్య అతడి మనసులో మరుగునపడిపోయి ఉంటుంది. గురువు చెయ్యవలసిన పని ఆ స్మృతిని మేల్కొల్పడం. గురువూ, శిష్యుడూ నిరంతరం వివేకరక్తులుగా సంభాషిస్తూ, సంభాషిస్తూ ఉండగా, ఒకనాటికి, ఒక హఠాత్ క్షణాన, ఆ స్మృతి నిప్పురవ్వలాగా విద్యార్థిలో మేల్కొంటుంది.
ఏది విద్య?
ప్రాచీన గ్రీకులకి ఈ సంగతి తెలుసు. వాళ్ళు చదువునీ, విద్యనీ రెండు అంతస్థుల్లో చూసారు. చదువు అంటే- పఠన, లేఖన, గణన సామర్థ్యాలు పాఠశాలలో అందుతాయనీ. కాని విలువలు, సంబంధాలు, నడవడిక నగరంలో నేర్చుకోవలసి ఉంటుందనీ.
ప్రసంగకళని దాటిన మధురనిశ్శబ్దం
కవిత్వం మొదటిదశలో ప్రసంగం, రెండవ దశలో పద్యం. కాని మూడవ దశలో ప్రార్థనగా మారాలి. ప్రసంగదశలో కవి ఉన్నాడు, ప్రపంచముంది. రెండవ దశలో కవి ఉన్నాడు, ప్రపంచం లేదు, కాని కవి అంతరంగముంది. మూడవ దశలో కవి కూడా అదృశ్యమై కేవలం అంతరంగమొకటే మిగలవలసి ఉంటుంది. అప్పుడు, అటువంటి దశలో, పలికిన మాటలు మంత్రాలవుతాయి.