మొన్న 30 వ తేదీనాడు ప్రపంచప్రసిద్ధ కవి, 1995 సంవత్సరానికిగాను నోబెల్ సన్మానితుడూ సీమస్ హీనీ డబ్లిన్ లో ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. యేట్సు తరువాత అంతటి స్థాయినందుకున్న ఐరిష్ కవిగా రాబర్ట్ లోవెల్ అతణ్ణి ప్రస్తుతించినప్పటినుంచీ, హీనీ కేవలం ఐరిష్ కవిగా మాత్రమే కాక తక్కిన ప్రపంచానికి చెందిన కవిగా కూడా మారిపోయాడు.