రావిశాస్త్రి

అటువంటి ప్రజాపోరాటాలు, ఉద్యమాలు, తిరుగుబాట్లు ఉవ్వెత్తున చెలరేగిన కాలంలో ఆయన జీవించాడు. వాటిని రెండుచేతులా స్వాగతించాడు. ప్రభుత్వం గురించి, రాజ్యం గురించి, పాలనాయంత్రాగం గురించి ఆయనకు చాలా స్పష్టత ఉంది. ప్రజలు కావాలని తిరుగుబాట్లు చెయ్యరు. కాని ప్రభుత్వాలు వాటిని కావాలని అణచేస్తాయి అని ఆయన పదే పదే చెప్పాడు.

నాయని సుబ్బారావు

తల్లి, పడతి, కొడుకు, కన్న ఊరు- ఒక మనిషి జీవితం తిరిగేది వీటి చుట్టూతానే. ఆ నాలిగింటితోటీ తన అనుభవాల్నీ, అనుభూతినీ కవిత్వంగా మార్చిన ఏకైక తెలుగు కవి నాయని సుబ్బారావు. నిజమైన స్వానుభవ కవి.