కాని ఒక యోగికి మరణం ఉండదు కాబట్టి, అది శోకించవలసిన సందర్భంకాదనే ఎరుక నాలో ఎక్కడో ఉంది. మనుషులంతా, చరాచరాలతో కలిపి, అంతర్గతంగా ఒకే అస్తిత్వంతో అనుధానమై ఉంటారు కాబట్టి, ఇప్పుడు ఆయన ఎక్కడికీ వెళ్ళలేదనీ, ఇంకా మరింత దగ్గరగా వచ్చారనీ విజ్జి చెప్తున్న మాటలు నమ్మదగ్గట్టుగానే ఉన్నాయి.