'ఇదే, ఈ స్వామి విశిష్టత. నువ్వు సరాసరి దుమ్ము కొట్టుకున్న నీ పాదాల్లోనే, నీ మార్గాయాసంతోనే నేరుగా ఆయన్ని పలకరించవచ్చు. దీన్నే ధూళిదర్శనమంటారు. తన దర్శనం కోసం ఎన్నో మైళ్లు అడవుల్లో, కొండల్లో పడివచ్చిందే నిజమైన శ్రద్ధ. ఇక ప్రత్యేకనియమ బంధాలెందుకులే అనుకునే స్వామి ఈయన.
