ఏమి పాఠం నేర్చుకున్నాం?

ఒక విపత్తు, కుటుంబాలకు గానీ, సమాజాలకు గానీ, సంభవించాక, అది నేర్పే పాఠాలు మన జాతిస్మృతిలో, సమాజస్మృతిలో భాగం కావాలి. అంటే విపత్తు విద్యగా మారాలి. ఆ పాఠాలు ఎంత క్రూరంగానైనా ఉండనివ్వు. కాని ఆ అనుభవాలు పాఠాలుగా మారకపోతే, మళ్ళా అలాంటి పరిస్థితులే సంభవించినప్పుడు, మనుషులు మళ్ళా అంతే క్రూరంగా ప్రవర్తిస్తారు.