నీ కట్టెదుట విధ్వసం సంభవిస్తున్నప్పుడు అది నీ ఆత్మలో విధ్వంసంగా పరిణమించాలి. మనిషిలోనో, భగవంతుడిలోనో నీ నమ్మకం కూకటివేళ్ళు తెగిపోయేటంతగా నువ్వు చలించిపోవాలి. ఏమి చేసి నిన్ను నువ్వు నిలబెట్టుకోగలవా, నీ ఆత్మని కాపాడుకోగలవా అని కొట్టుకుపోవాలి.
పునర్యానం-32
కాని ఆధునిక యుగం పతనావస్థకు చేరుకున్న కాలంలో నేనున్నాను. ఇది ఉత్సవసందర్భం కాదు, ఉద్రేకప్రకటనా నడవదు. ఇప్పుడు పలికేది ఒక ఆక్రందన, గుండెలు బాదుకోడం మాత్రమే. దానికి ఎక్కడ? ఏ కవిత్వం నుంచి నేను స్ఫూర్తి పొందగలనని ఆలోచించాను.
జాతీయోద్యమ స్ఫూర్తి భద్రపరచుకోవాలి-2
కాని కాలం జాతీయోద్యమ కవుల పక్షానే నిలిచింది. తర్వాత రోజుల్లో తిరిగి మళ్ళా ప్రజలు తమ సాంఘిక, రాజకీయ అసంతృప్తిని, అసమ్మతిని ప్రకటించడానికి గరిమెళ్ళ బాటనే పట్టారు. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండులు మొదలుకుని గద్దర్ దాకా కూడా ఒక అవిచ్ఛిన్న గేయకారపరంపర కొనసాగుతూ వస్తున్నదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు
