అందుకని, మొదటగా, తెలుగు సాహిత్యం మీద ఇప్పటిదాకా రాసిన వ్యాసాల్ని పుస్తకరూపంలో అందివ్వాలని అనుకున్నాను. వాటితో పాటు, ఈ మధ్యకాలంలో రాసిన కొన్ని సమీక్షలూ, ముందుమాటలూ కూడా కలిపి 125 వ్యాసాలతో 'దశార్ణ దేశపు హంసలు' పేరిట ఇలా పుస్తకరూపంలో అందిస్తున్నాను.
సాహిత్య సంస్కారం
2010 నుంచి 2017 మధ్యకాలంలో రాసిన విమర్శనాత్మక వ్యాసాలు 'సాహిత్య సంస్కారం' పేరిట ఎమెస్కో ప్రచురణగా వెలువడ్డాయి. ఈ పుస్తకంలోని 64 వ్యాసాల్లో కవిత్వం, కథ, నవల, నాటకం, లేఖాసాహిత్యప్రక్రియలతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక అధ్యయనాలకు సంబంధించిన గ్రంథాల పరిశీలన ఉంది.