నివ్వెర పరిచిన పదం

సారంగపాణి రాసిన పదాల్లో జాతీయ పదాల పేరిట వర్గీకరించినవి ప్రధానంగా ఆనాటి సామాజిక స్థితిగతులకు అద్దం పడతాయి. మరీ ముఖ్యంగా రాయలసీమను కలచివేసిన కరువుకాటకాల యథార్థ చిత్రం ప్రజల భాషలో ఆ పదాల్లో చిత్రణకి వచ్చింది. కరువులో తినడానికి తిండిలేని ఒక రైతు కుటుంబం ఇంటికి ఒక యాచకుడు భిక్షకోసం వచ్చినప్పుడు అతడికి ఏమీ ఇవ్వలేకపోతున్న ఆ తల్లి వేదన చూడండి: ~ కిన్నరవాస్తా నిలబడుకుంటె- గింజలేద్డ దైతం యాడ అన్ని లేవె, యెందొల్లడ బెట్టిన అగిత్తెమ …

సజీవసంగీతాలు

అవి ప్రజల నాలుకలమీద నడయాడుతున్న సజీవసంగీతాలు. వాటిల్లో నుతులు ఉన్నాయి, స్తుతులు ఉన్నాయి, తత్త్వాలు ఉన్నాయి. కవి హృదయం నుంచి నేరుగా పల్లవించిన అంకురాలవి.

తెలుగువాడి గుండెచప్పుళ్ళు

తరిగొండ ప్రసన్న నరసింహస్వామి గుడి ముంగిట నిల్చుని మరొకసారి వెంగమాంబకు మనసారా నమస్సులర్పించాను. కొందరి దృష్టి చరిత్ర మీద ఉంటుంది, చరిత్ర నిర్మించడం మీద ఉంటుంది. మరికొందరి దృష్టి చరిత మీద ఉంటుంది. తమని తాము సంస్కరించుకునే ప్రయత్నంలో తమకు తెలియకుండానే వారు కొత్త చరిత్ర సృష్టిస్తారు. వెంగమాంబ రెండవతరహాకి చెందిన మనిషి, కవి.