కొన్ని కలలు కొన్ని మెలకువలు-26

10

వియ్ షల్ ఓవర్ కమ్

ఆ మర్నాటిరోజు నాకు వ్యక్తిగతంగానూ, ఉద్యోగజీవితంలోనూ గొప్ప మెలకువనిచ్చిన రోజు. ఆ పొద్దున్నే పదిగంటలవేల ఉత్నూరు బాలికల పాఠశాలలో అడుగుపెట్టాను. అక్కడ ఉదయసూర్యకాంతిలో బంగారు బంతి పూలు వికసించి ఉన్నాయి. పిల్లలంతా   ఉదయపు తరగతుల్లో కొమ్మల్లో కుదురుకున్న పక్షుల్లాగా ఉన్నారు. గాలంతా ఏదోమౌనం ఆవహించి ఉంది.

నేను నేరుగా ప్రధానోపాధ్యాయుడి గదిలోకి అడుగుపెట్టాను. నన్ను చూస్తూనే గంగాధర్ ఒక్క ఉదుటున లేచి ఒక్క ఉదుటున లేచి వచ్చి నన్ను ఆహ్వానించి నాకు కుర్చీ చూపించాడు. అతడు కిందటి రోజుదాకా పెద్దయుద్ధం చేసి అలసిపోయినవాడిలా  ఉన్నాడు. అతనిలో మామూలుగా కనబడే ఉల్లాసం, ఉత్సాహం నాకేమీ కనబడలేదు. అలాగే అతడి సహచరులు సుధాకర్, తుకారాం మొదలైన ఉపాధ్యాయులంతా నన్ను చూడటానికి ఆ గదిలోకి ఒకరివెనక ఒకరు రావడం, నాకు కుశలపూర్వకంగా నమస్కరించడం, ఆ పైన మౌనంగా నిలబడటం.

అదంతా చూస్తే ఏదో జరిగిందని నాకేదో సంకేతమందుతూ ఉంది. వారిలో భయం లేదు. నిన్నటిరోజు ధర్నాలో ఎందుకు పాల్గొన్నారని తమని నిలదీయడానికి గిరిజనసంక్షేమాధికారి వచ్చాడని వారెవ్వరూ అనుకోలేదు. నేను వారిని వెంటాడడానికి రాలేదని నేనక్కడికి రాకపూర్వమే వారికెవరో రహస్యంగా చెప్పినట్టే ఉన్నాయి వారి చూపులు. నేను కొంతసేపట్లా ఆ గదిలో మౌనంగా కూచున్నాను. ఆ ఉపాధ్యాయులు కూడా మౌనంగా నిల్చున్నారు. ఇంతలో ఎవరో ఒక కప్పు టీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు.

ఏం జరిగింది ఇరవైనాలుగ్గంటల్లో? ఏదో మిరకిల్ జరిగినట్టే అనిపించింది నాకు. నిన్నటి సంఘటన నాలోనూ, వారిలోనూ కూడా ఏదో మార్పుని తీసుకొచ్చింది. అది ఇంతకు పూర్వం మాకు అనుభవానికి రానిది, మేం ఊహించలేనిది.

నిన్నటిదాకా, వారంతా ఉపాధ్యాయులు, సంస్ధలో ఉద్యోగులు. నేను వారికి అధికారిని. వారి జీతాలు, సర్వీసు విషయాలు, ఇంక్రిమెంట్లు చూసే ఉద్యోగిని. వారి పాఠశాలకు పర్యవేక్షకుణ్ణి. ఆ సంబంధంలో ఎక్కడో ఏదో మితిమీరి, ఎక్కడో ఏదో శృతి తప్పి ఘర్షణగా మారింది. ఇరుపక్షాలూ తాడు తెగేదాకా లాగేరు. ఒక తంత్రి తెగిపోవాలి నిజానికి.

కాని అలా జరగలేదు. నిన్నటి ఆ అనుభవం తర్వాత మా మధ్య పూర్వపు ఉద్యోగసంబంధం స్ధానంలో ఆత్మీయతా సంబంధం మేల్కొంది. మేం ఒక కుటుంబంగా మారిపోయాం.

ఎందుకు జరిగిందిట్లా? నేను ఆలోచిస్తూనే ఉన్నాను. నాకు నెమ్మదిగా అర్ధమయింది. ఆ ఉపాధ్యాయులు, నా మీద ధర్నాకు దిగి నన్ను నడిరోడ్డు మీద దూషించిన ఆ ఉపాధ్యాయులు తమ అంతరంగంలో నన్ను అభిమానిస్తున్నారనీ, ఆ సంగతి వారికి కూడా నిన్ననే బోధపడిందనీ నాకు అర్ధమయింది.

ఆ సంఘటనతో అంతదాకా నివురుకప్పినట్టున్న ఆ ఇష్టం, అభిమానం వారిలో ఒక్కసారిగా మేల్కొన్నాయి. వారు నా మీద అగ్రహంతో కాక, లేదా నేను మాట్లాడుతూ వచ్చిన విద్యాదర్శాల మీద అపనమ్మకంతో కాక, అనుమానంతో కాక, ఒక అభద్రత వల్లనే ఆ నిరసన ప్రదర్శనకు పూనుకున్నారని నాకొక్కసారిగా తెలియ వచ్చింది.

వారిలో ప్రతి ఉపాధ్యాయుడూ మేం రూపొందించుకున్న సమగ్ర ప్రణాళికను ప్రేమిస్తూనే ఉన్నాడనీ, దాన్ని అమలు చెయ్యడానికీ అతనికి మనఃపూర్వక సంసిద్ధత లేకపోలేదనీ కూడా నాకు గ్రహింపుకు వచ్చింది. బహుశా, వారు నా మీద చూపుతున్న అగ్రహం నిజానికి వారు వారి పట్ల చూపుతున్నదే అని కూడా నేను అవగతం చేసుకున్నాను.

నిన్నటి రాత్రంతా బహుశా వారికి నిద్ర పట్టి ఉండదు. వారిలోవారికి తీవ్రమైన అంతస్సంఘర్షణ చెలరేగి ఉంటుంది. ఎందుకు అటువంటి సంఘటన జరిగిందా అని నేనెట్లా వ్యాకులతతో ముందురాత్రంతా గడిపానో, అటువంటి వ్యాకులతకే వారు కూడా లోనయి ఉంటారు. తమని తాము నిస్సంకోచంగా నిలదీసుకుని ఉంటారు. తమతో తాము పోరాడుకుని ఉంటారు. ఆ పోరాటంలో అలసిపోయి ఉంటారు. ఆ అలసటనే ఆ రోజు ఉదయం నేను ఆ ప్రధానోపాధ్యాయుడి వదనం మీద గమనించాను.

కొద్ది మౌనం తర్వాత నేనిక్కడినుంచి లేచి వచ్చేసాను. నా మనసు చాలా తేలికపడింది. సంకల్పం సామర్ధ్యంగా పరిణమించాలన్న నా ఆతృత సంఘర్షణకు తావిచ్చింది. కాని అది చివరికి సమాధానానికీ, సామరస్యానికీ ప్రయాణిస్తోందన్న తృప్తి కలిగింది.

ఆ రాత్రి మా ప్రాజెక్టు అధికారి కేంప్ నుండి తిరిగి వచ్చి నన్ను ఇంటికి పిలిపించారు. జరిగిన సంఘటన గురించి ఆయనకప్పటికే కొంత సమాచారమందింది. ‘మీరు చెప్పండి. వారికి ఏ శిక్ష విధించమంటారు? అత్యంత కఠినమైన శిక్షను విధించడానికి కూడా నేను సిద్ధమే’ అన్నారాయన.

ఆ సమయంలో నా ఆలోచనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎంత పని చేయని ఉపాధ్యాయుడైనా స్వభావరీత్యా ఉపాధ్యాయుడే. అతడిలో స్వధర్మం మీద సమాజపు ధూళి ఎంత ఆక్రమించినా అది లోపల్లోపల ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. నిరంతరం చిన్నారి పిల్లలతో సహజీవనం అతనిలో మానవత్వాన్ని మరుగున పడనీయదు.

కాని సాంఘికంగా ఉపాధ్యాయుడు నిరంతరం అభద్రతా భావానికి లోనవుతూనే ఉంటాడు. అతని ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టి అతని వెన్నుతట్టి ప్రోత్సహించే స్ధితికి మన సమాజంలో అధికభాగం సిద్ధంగా లేదు. అతడిని అదుపు చేయాలని చూసే అధికార శక్తులకు కొదవలేదు. ఆ నిర్మాణాల ముందు, ఆ అణచి వేతల ముందు అతడు దుర్బలుడిగా నిలబడవలసి వస్తున్నది. అందుకు అతడు తనను తాను క్షమించకోలేకపోతున్నాడు.

తన ఆత్మబలంకన్నా సంఘబలం అవసరమని ఉపాధ్యాయుడు భావిస్తున్నాడంటే దానికి కారణం అతణ్ణి ఆ పరిస్ధితికి నెట్టిన సమాజమే. అలాగని ఉపాధ్యాయుడు ఉత్తమ భావాల్నీ, సామాజిక పరివర్తననీ వ్యతిరేకిస్తున్నాడని తీర్మానించలేం. ఆ మార్పు అతని ఆత్మగౌరవానికి భంగం కలిగించేదికాదనీ హామీ అతనికి లభిస్తే ఆ మార్పుని ముందుకు తీసుకుపోయేవాళ్లల్లో అతడే ముందుంటాడు.

నిజమే, ఆ ఉపాధ్యాయులు నామీద చాలా ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. నేను రాత్రి పొద్దుపోయేదాకా సమీక్షాసమావేశాలు నిర్వహిస్తున్నాననీ, అది తమకి ఇబ్బంది కలిగిస్తోందన్నది ఫిర్యాదు. కానీ, సంస్ధ మీద నిరసన ప్రకటించడానికి, ధర్నా చెయ్యడానికి సంఘం పిలుపునివ్వగానే ఆ ఉపాధ్యాయులే లారీలు, జీపులు, ట్రాక్టర్లలో వందలాదిగా తరలివచ్చారు.

అంటే ఏమిటి? వారిలో శక్తి లేదనికాదు, వారు కష్టనష్టాలకు ఓర్వలేనివి కారు. అసౌకర్యాన్ని భరించలేరని కారు. అవన్నీ వారికి సమ్మతమే. ఎప్పుడు? అది వారి ఇష్టపూర్వకంగా చేసినప్పుడు. అదే, నేను సమీక్షా సమావేశానికి పిలిచి దారి ఖర్చులు ఇచ్చినా అది వారికి కష్టంగానే తోస్తున్నది. ఎందుకు? వారికి ఇష్టం లేదు కనుక. అంతే. కావలసిందల్లా తలపు. తలచుకుంటే సాధ్యం కానిది లేదు, ఆ తలపు ఎట్లా పుడుతుంది? ఆ కార్యక్రమాన్ని వారు తమ మీద రుద్దినదానిగా కాక, తమ స్వంత కార్యక్రమంగా భావిస్తే కలుగుతుంది. తాము పనిచేస్తున్న పాఠశాలల్ని ప్రభుత్వ పాఠశాలలుగా కాక తమ పాఠశాలలుగా భావిస్తే జరుగుతుంది. వారు అలా భావించేటట్టు చేయాలంటే ఏమి చేయవలసి ఉంటుంది?

నేను మా ప్రాజెక్టు అధికారి అడిగిన ప్రశ్నకు ఇలా జవాబు చెప్పాను. ‘సార్, మనం ఇంతదాకా ఉపాధ్యాయులకు తమ పాఠశాలల్లో బోధనాభ్యసన ప్రక్రియని గుణాత్మకం చేసే సామర్ధ్యం లేదనీ, ఆ సామర్ద్యాన్ని ఎలా ఇవ్వాలా అనీ ఆలోచిస్తూ వచ్చాం. ఇప్పుడు నాకు బోధపడిందేమంటే సామర్ధ్యం దానికదే విలువకాదు. అది తిరిగి సంకల్పం మీదనే ఆధారపడుతుంది.’

‘ఉపాధ్యాయులూ, పాఠశాలలూ భీతావహవాతావరణంలో పనిచేయలేవని నాకు అర్ధమయింది. మనకీ, మన ఉపాధ్యాయులకీ మధ్య మానసిక దూరం ఏర్పడింది. ఆ దూరాన్ని తమకు అనుకూలంగా మార్చుకవడానికి వివిధ శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. మనం ఇంతదాకా ఇచ్చిన శిక్షణ, విధించిన శిక్షలూ చాలు. మనం మన వైఖరిని, ధోరణినీ మార్చుకోవడం మంచిది’ అన్నాను.

సుబ్రహ్మణ్యంగారి వ్యక్తిత్వంలోని అపురూప అంశం అదే. ఆయనకి నా మాటలద్వారా ఏ సంవేదన బోధపడాలో అది తక్షణమే బోధపడింది. ఆయన దాని మీద వాదించవలసింది మరేమీ ఉందనుకోలేదు. చర్చించి తేల్చుకోవలసింది కూడా ఆయనకేమీ కనబడలేదు. ఆయన ఇక మేం చేయవలసినపని ఏమిటో నిర్ణయించుకుని ఆ ప్రకారం ముందుకుపోవడానికి సంసిద్ధుడైన వాడిమల్లే ‘అయితే, రేపు మనం ఏం చేద్దామంటారో చెప్పండి’ అన్నారు.

ఆయనా, నేనూ, ప్రొఫెసర్ శశిధరరావుగారూ కలిసి రానున్న ఆ వారమంతా తాలూకావారీ కేంద్రాలలో ఉపాధ్యాయులతో ముఖాముఖీ సమావేశం కావాలని నిర్ణయించుకున్నాం. ఆ సమావేశాలకు ఎజెండా అంటూ ఏమీ లేదు. అది కేవలం ముఖాముఖీ మాత్రమే. ఏ ఉపాధ్యాయుడైనా ఏ అంశం మీదనైనా ప్రాజెక్టు అధికారితో చర్చించవచ్చుననీ, ఏ సమస్య ఉన్నా పరిష్కారాన్ని కోరవచ్చుననీ పత్రికా ప్రకటన ఇచ్చాం.

ఆ సమావేశాలకు వచ్చిన స్పందన అపూర్వం. బహుశా, కేవలం విద్యా రంగంలోనే కాదు. మరే రంగంలో కూడా ఏ యాజమాన్యమూ అటువంటి సమావేశాల్ని నిర్వహించి ఉండదు. ఆ ప్రాంతంలో అత్యంత బలమైన కార్మికవర్గం కూడా సింగరేణి యాజమాన్యంతో అటువంటి సమావేశాల్ని ఊహించిఉండదు. మా శిక్షణాకార్యక్రమాలన్నిటికన్నా కూడా ఆ సమావేశాలు అత్యంత విలువైనవని నేను భావిస్తున్నాను.

ఉపాధ్యాయుడికి సామర్ధ్యం కొరవ అయినందువల్ల కాక, అతని మనసును తట్టిలేపనందువల్ల మాత్రమే పాఠశాలలు నిస్తేజంగా ఉన్నాయని నాకు బోధపడింది. ఒకసారంటూ అతడి మనసుని స్పృశించి మేల్కొల్పాక ఇక తక్కినవారు చెయ్యవలసి దంటూఏమీ ఉండదు. అదంతా తన మనోబలంతో ఉపాధ్యాయుడే నడుపుకుంటూ పోగలుగుతాడు.

బహుశా, మేము నేర్చుకున్న ఈ విలువైన పాఠం కేవలం పాఠశాలలకూ, ఉపాధ్యాయులకూ మాత్రమే పరిమితమైంది కాదనీ, ఇది ఏ సంస్ధకైనా, ఏ ఉద్యోగి బృందానికైనా వర్తించే సత్యమేననీ కూడా నేను చెప్పవలసి ఉంటుంది.

ఆ తర్వాత వారంరోజులకు అతడు ఇచ్చోడ నుంచి పండ్ల మొక్కల్ని ట్రాక్టర్ కెత్తించుకుని నిర్మల్ పోతూండగా చూసామని ఎవరో చెప్పగా విన్నప్పుడు అది నాకేమీ ఆశ్చరాన్ని కలిగించలేదు.

ఈ మధ్యలో రెండుమూడు సంతోషకరమైన సంఘటనలు కూడా ఉన్నాయి. వాటిలో చెప్పదగింది. పాఠశాలలన్నిటికీ కలిపి జిల్లా స్ధాయిలో మేమొక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసిన సంగతి. రవీంద్రకుమారశర్మ నేతృత్వంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ చొరవతో మేం అదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శనకి ప్రఖ్యాత చిత్రకారులు పి.టి.రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసారు. గిరిజన బాలబాలికలు చిత్రించిన ఆ చిత్రాల్ని చూసి ఆయన ముగ్ధులయ్యారు. దాదాపు మూడువేలకి పైగా ప్రదర్శనలో పాల్గొన్న ఆ చిత్రాల్లో ఆయన కనీసం పదింటిని అంతర్జాతీయ స్ధాయి చిత్రలేఖనాలుగా ఎంపిక చేసారు.

ఆ ఎంపిక వెనక ఆయన పట్టించుకున్న సూత్రాలు చాలామందికి అర్ధం కాలేదు. అవి మా ఆర్ట్ మాష్టార్ని గుర్తు తెచ్చాయి. ఆయన తాడికొండలో చిత్రలేఖనం పోటీపెట్టినప్పుడు నైపుణ్యం కన్నా పెర్‌స్పెక్టివ్‌కి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చాడని చెప్పాను కదా. పి.టి.రెడ్డి చేసిన ఎంపికకి కూడా ఆ పెర్‌స్పెక్టివే ప్రాతిపదిక అని చెప్పవలసి  ఉంటుంది.

ఇటువంటి గానం మధ్య, గీతం మధ్య హఠాత్తుగా నా బదిలీ ఉత్తర్వు వచ్చి పడింది.

ఆ ఉత్తర్వులు రావడానికి కొద్దిగా ముందు మా ప్రాజెక్టు అధికారి చూచాయగా నాకొక సూచననిచ్చారు. జిల్లాలో ఇంకా మా పట్ల వ్యతిరేకత తగ్గలేదనీ, అది మంత్రిగారిని బాధిస్తూ ఉన్నదనీ, త్వరలోనే మా ఇద్దరిలో ఎవరో ఒకరి బదిలీ జరగవచ్చుననీ ఆయన అన్నారు.

ఆ బదిలీకి ముందుగా తను గురవుతానని ఆయన అనుకున్నట్టున్నారు. నా బదిలీ ఆయన్ని ఆశ్చర్యానికి లోను చేసింది. అప్పటికి నేను ఉత్నూరు వెళ్లి ఏడాదిన్నర కూడా కాలేదు. ఏ విధంగా చూసినా అది అర్ధాంతరంగా చేసిన బదిలీ అనే అనవలసి ఉంటుంది. నేనప్పటికి నిర్లిప్త స్ధితికి చేరుకున్నాను. నా బదిలీ ఉత్తర్వుల్ని స్వీకరించ డానికి నాకే సంకోచం లేకపోయింది.

కాని, అనూహ్యంగా ఆ ఉత్తర్వులు నాకు అందనేలేదు. ఆ ఉత్తర్వుల్ని నా చేతికి అందించడానికి మా ప్రాజెక్టు అధికారి ఇష్టపడలేదు. కనీసం ఆ విద్యాసంవత్సరం చివరివరకైనా సరే నన్ను అక్కడనే అట్టేపెట్టాలనుకున్నారాయన. కలెక్టరుతో, పై అధికారులతో మాట్లాడారు. కాని, ప్రభుత్వం ఆ బదిలీ చెయ్యవలసిందేననీ ఆయనకు    ఉత్తర్వులు వచ్చాయి.

ఈ లోగా బహుశా, నా బదిలీ ఉత్తర్వుల్ని ప్రాజెక్టు అధికారి రహస్యంగా   ఉంచుతారేమోనన్న ఉద్దేశ్యం వల్ల కాబోలు, నన్ను వ్యతిరేకిస్తున్నవారు ఆ బదిలీ  ఉత్తర్వుల్ని జిరాక్సుతీయించి ఊళ్లో పంచారు. దాని ఫలితం మరోలా ఉండింది. నన్ను అర్ధాంతరంగా బదిలీ చేసారని తెలియగానే ఊహించని ప్రజాస్పందన వ్యక్తమయింది.

ఉపాధ్యాయులు, గిరిజనపెద్దలు, విద్యార్ధులు, అధికారులు, గిరిజన సంక్షేమానికి చెందనివారు కూడా ఒక్కలా అగ్రహాన్ని వ్యక్తం చేసారు. వారి హృదయాల్లో అంతదాకా నా పట్ల నిద్రాణంగా ఉన్న అభిమానమంతా ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చింది. వారంతా ప్రాజెక్టుఅధికారి వద్దకు పోయి నన్ను రిలీవ్ చెయ్యవద్దని తాము ప్రభుత్వం దగ్గరకు పోతామనీ అన్నారు.

కొందరు ఉపాధ్యాయులు నా బదిలీ ఆగేదాకా నిరాహారదీక్షలకు సిద్ధమయ్యారు. అన్నిటికన్నా విశేషమేమిటంటే ఏ ప్రధానోపాధ్యాయుణ్ణి మేం రాయిగూడ నుంచి బదిలీ చెయ్యడం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు తీవ్ర అగ్రహం తెప్పించిందో,  ఆ ప్రధానోపాధ్యాయుడే నా బదిలీ ఆపాలంటూ నిరాహారదీక్షకు కూచున్నాడు.

పత్రికలు గిరిజనవిద్యారంగంల నా కృషిని వివరిస్తూ ప్రత్యేక వార్తాకథనాలు రాసాయి. నా బదిలీని వ్యతిరేకిస్తూ ఉత్నూరు మొత్తం బంద్ పాటించింది. నాకన్నా విశేష కృషి చేసి గిరిజనుల మన్ననలు పొందిన నా పూర్వపు అధికారులు బదిలీ అయినప్పుడు కూడా ఉత్నూరులో బంద్ జరగలేదు. కాని ఆ సారి ఆ బదిలీవార్తని ఎందుకనో గిరిజన సమాజం అంగీకరించలేకపోయింది.

ఆరోజు బంద్ పిలుపునిచ్చింది విద్యార్ధి సంఘాలు అని తెలిసినప్పుడు నా ఆశ్చర్యానికి అంతులేదు. నేను చేపట్టిన ప్రతి చర్యా గిరిజన విద్యార్ధిని ఉద్దేశించి చేపట్టినదే అయినప్పటికీ విద్యార్ధులు నా చర్యల్ని అర్ధం చేసుకుంటారనీ, నాకు మద్ధతుగా నిలుస్తారనీ నేను ఎన్నడూ ఊహించి ఉండలేదు.

ఎందరో ఉపాధ్యాయులు శ్రేయోభిలాషులు నన్ను బదిలీ కావద్దనీ, అక్కడనే నిలవమనీ, అది నేను ట్రిబ్యునల్‌కి వెళ్లడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనీ అన్నారు. బహుశా మా ప్రాజెక్టు అధికారి ఉద్దేశ్యం కూడా అదేకావచ్చు. చివరికి ఆ రాత్రే ఒక   ఉపాధ్యాయుడు హైదరాబాద్ బయలుదేరిపోయాడు.

ట్రిబ్యునల్ ఎదట మా సమగ్ర ప్రణాళిక ప్రతిని, మా సమీక్షా సమావేశాల మినిట్సునీ, నా బదిలీ సందర్భంగా పత్రికలు ప్రచురించిన ప్రత్యేక వార్తాకథనాల్నీ మా తరపు లాయరు ప్రవేశపెట్టాడు. సాధారణంగా బదిలీ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ వచ్చే కేసుల్ని ట్రిబ్యునల్ ఆడ్మిషన్ సమయంలోనే తిరస్కరిస్తుంది. బదిలీలు ప్రభుత్వ దైనందిన పాలనావ్యవహారానికి సంబంధించినవి కాబట్టి వాటిలో జోక్యం చేసుకోవద్దని ట్రిబ్యునల్‌కి సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు ఉన్నాయి.

కాని ఆ రోజు తమ ముందు కొచ్చిన ఆ కేసు అసాధారణమైన కేసు అని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. దాన్ని తిరస్కరించడానికి ట్రిబ్యునల్ ఇష్టపడలేదు. ఆ బదిలీ ఉత్తర్వుల్ని కొట్టిపారేసింది.

అయితే, నేను ఆ విద్యాసంవత్సరం ముగిసేదాకా నన్నక్కడనే నిలుపుదల చేయవలసిందిగా అభ్యర్ధిస్తూ ప్రభుత్వానికొక వినతి నివ్వాలనీ, ప్రభుత్వం దానిమీద తగునిర్ణయం తీసుకోవాలనీ ట్రిబ్యునల్ ఆదేశించింది.

కోర్టు నిర్ణయాన్ని ఎవరో ఆఘమేఘాల మీద తెలియచేయగానే మా ప్రాజెక్టు అధికారి నిరాహారదీక్షలో ఉన్న ఉపాధ్యాయులకు స్వీట్లు పంచి ఆ దీక్షని విరమింప చేసారు. అదొక ఆనందఘడియ. అది బదిలీ ఆగిందన్న సంతోషం కాదు. ఉపాధ్యాయులకూ, సంస్ధకూ మధ్య కొంతకాలంగా నెలకొన్న కారుమబ్బులు ఈ గాలితో చినికి ముత్యాలజల్లులుగా వర్షించాయని.

ట్రిబ్యునల్ సూచించినట్టే నన్ను విద్యాసంవత్సరం ముగిసేదాకా ఉత్నూరులోనే నిలుపుదల చేయవలసిందిగా అభ్యర్ధిస్తూ నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి సమర్పించాను. ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు.   

ఈలోగా ఆడుతూ పాడుతూ పుష్యమాసం ముగింపుకొచ్చింది. ఈసారి కేస్లాపూర్ దర్బార్‌కి మంత్రులతో, ఉన్నతాధికారులతో పాటు రాష్ట్రంలోని గిరిజనాభి వృద్ధి సంస్ధల ప్రాజెక్టు అధికారులు కూడా వస్తున్నారన్న వార్త వచ్చింది. వారంతా మా పాఠశాలల్ని చూడటానికి వస్తున్నారని తెలియడం మరీ సంతోషాన్ని కలిగించింది. అప్పటికే మా   ఉత్నూరు ప్రయోగాల గురించీ, ప్రయత్నాల గురించీ రాష్ట్రమంతటా వార్తలు వ్యాపించేయి.

మేం ప్రాజెక్టు అధికారులకు మార్లవాయిలో ఏకోపాధ్యాయ పాఠశాలనీ, ఉత్నూరులో నెలకొల్పిన క్రీడా పాఠశాలనీ, పాఠశాలల్లో నెలకొల్పిన గ్రంథాలయాల్నీ, లాబరేటరీల్నీ చూపాలనుకున్నాం. ముఖ్యంగా స్వరూపమే మారిపోయింది. ఆ పాఠశాలని కూడా అందరికీ చూపాలనుకున్నాం.

దర్బార్ ముందురోజు సాయంకాలం ప్రాజెక్టు అధికారి బంగళా నుంచి నాకు పిలుపు వచ్చింది. అక్కడ మా కమిషనర్, ఇతర ప్రాజెక్టు అధికారులు ఉన్నారు. నేను అక్కడికి వెళ్లగానే మా ప్రాజెక్టు అధికారి నన్ను చూసి చిరునవ్వుతూ ‘నేను ముందే చెప్పాను కదా, ప్రభుత్వం గురించి, ఏమైనా సరే నిన్ను ఇక్కడ ఉండనివ్వ కూడదని వాళ్లు కంకణం కట్టుకున్నారు’ అన్నారు.

నాకు ఒక్క క్షణం అర్ధం కాలేదు. ఈసారి నా బదిలీ ఉత్తర్వుల్ని స్వయంగా చేతపట్టుకుని ప్రభుత్వమే ఉత్నూరు వచ్చిందని అర్ధం కాగానే నాకొక్కసారిగా దిగులు కలిగింది. మొదటిసారి బదిలీ ఉత్తర్వుల్ని నేను నిర్లిప్తంగా స్వీకరించగలిగాను గాని, ఈ సారి ఉదాసీనంగా ఉండటం నాకు చేతకాలేదు.

నేను చేసిన తప్పేమిటి? ఎందుకు నా ఉనికిని ప్రభుత్వం అక్కడంత ప్రమాదకరంగా భావిస్తూ ఉంది? ఎన్నో జ్ఞాపకాలొక్కసారిగా కదిలిపోయాయి. బంతిపూల మధ్య వికసించిన కుంతన్‌మాన్‌పల్లి బాలికల పాఠశాల, భూపాలపట్నం ఆశ్రమపాఠశాలలో రాత్రిబస, అందర్‌బంద్ పాఠశాలలో పిల్లలతో ఆడిన గుసాడి, మోవాడ్ కొండలమీద నాటిన మామిడిమొక్కలు, భీమారం హాస్టల్ లైబ్రరీలో చదివిన టాల్‌స్టాయి రచనలు. అన్నిటికన్నా ముఖ్యం బాసర జ్ఞానసరస్వతి.. ఆ నేలను వదిలిపోక తప్పదన్న వార్తకి హృదయం మళ్లా గాయపడి మూలిగింది.

ఆ మర్నాడు మా కమిషనర్‌ను, ప్రాజెక్టు అధికారులను తీసుకుని మా పాఠశాలలన్నీ తిప్పి చూపించాం. ఆ పొద్దున్నే ఉత్నూరు క్రీడా పాఠశాలలో బాలబాలికలు ఉదయసూర్యకాంతిలో మిలమిలా మెరుస్తూ ‘వియ్ షల్ ఓవర్ కమ్, వియ్ షల్ ఓవర్ కమ్’ అనే గీతాన్ని అలపించారు.

ఒకసారి ఎప్పుడో సమీక్షా సమావేశాల్లో మా కమిషనర్ చెప్పగా మొదటిసారి విన్నాను ఆ పాట గురించి. భోపాల్‌లో జరిగిన స్కౌటు జంబోరీలో వేలాదిమంది బాలికలు ఆ పాట పాడగా విన్నాననీ, మన గిరిజన పాఠశాలల్లో ఎన్నటికన్నా ఆ పాటని వినగలనా అని ఆమె అనడం నాకు గుర్తుంది. అందుకే ఆ పాటని ఏరుకుని తెచ్చుకున్నాను. మా మూజిక్ బృందం ఆ పాటని పిల్లల కంఠాల్తో కాక హృదయాల్తో పాడించారు. ‘మేం ఎటువంటి అడ్డంకులైనా అధిగమించి తీరతాం, అధిగమించి తీరతాం, నా అంతరాంతరాల్లోంచీ నేనా విషయాన్ని ప్రగాఢంగా నమ్ముతున్నాను’ అని మొదలయ్యేపాట అది.

ఆ గోండు, కొలాము బాలికలు ఆ ప్రభాతవేళ గళాలెత్తి ‘మేం జయించి తీరతాం’ అని పాడుతుంటే, మా పాఠశాలల్లో ఏది చూడాలని మా ప్రాజెక్టు అధికారులంతా ఎదురుచూసారో అది వారికి దర్శనమిచ్చినట్టే అనిపించింది. ఇక ఆ తర్వాత మరేదీ చూడాలన్న కోరిక వారిలో నాకు కనపడలేదు.

కేస్లాపూర్ దర్బార్‌లో మంత్రిగారు, కమిషనర్, ఇతర అధికారులు సమావేశ మయ్యేటప్పటికే నా బదిలీ వార్త అందరికీ చేరిపోయింది. అక్కడ పాల్గొన్న గిరిజన పెద్దలు ప్రతి ఒక్కరూ నాబదిలీని నిలుపుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. చివరికి ఒకప్పటి గిరిజన సంక్షేమశాఖ మంత్రి, పూర్వాశ్రమంలో ఉపాధ్యాయుడూ అయిన గోడెం రామారావుగారు కూడా బదిలీ నిలుపుదల చెయ్యమని ప్రభుత్వాన్ని స్పష్టంగా అభ్యర్ధించారు.

దానికి మంత్రిగారేమీ బదులివ్వలేదు. కమిషనర్ మాత్రం నా సేవలు విశాఖపట్టణం జిల్లాకి కూడా అవసరమయిందువల్లనే నన్ను బదిలీ చేయక తప్పట్లేదని వివరించారు.

అక్కడితో ఆగకుండా ఆమె నన్ను వెంటబెట్టుకుని ఆశ్రమ పాఠశాలకు వచ్చారు. దారిలో, బదిలీలు ప్రభుత్వోద్యోగులకు తప్పవనీ, వాటిని స్పోర్టివ్‌గా తీసుకోవాలని ఆమె చెప్తున్నారు. బహుశా నేను మళ్లా ఏ కోర్టుకో వెళ్తాననీ, దానివల్ల ప్రభుత్వానికి మళ్లా ఇబ్బంది ఎదురవుతుందనీ ఆమె ఉద్దేశ్యం అయిఉండవచ్చు. మొదటిసారి కూడా కోర్టుకి వెళ్లడం నా అభిమతం కాదనీ, ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉత్తర్వుల్ని తప్పకుండా పాటిస్తాననీ ఆమెకి చెప్పాను.

దర్బార్ ముగిసింది. మా ప్రాజెక్టు అధికారి అప్పటినుంచీ రెండువారాల పాటు స్వంతపని మీద సెలవులో వెళ్తున్నారు. ‘నీ బదిలీ ఉత్తర్వుల్ని నీకు సర్వ్ చేసే బాధ్యత నుంచి నన్ను భగవంతుడే తప్పించాడు’ అన్నాడాయన నాతో. అక్కడే నన్ను హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు. ‘తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరౌ’ అన్న కవివాక్యం గుర్తొచ్చింది ఆ క్షణాన్న.

కేస్లాపూర్‌లో ప్రారంభమయిన విద్యాదర్శ దర్శనం, ప్రయత్న పరంపర తిరిగి కేస్లాపూర్‌లోనే ముగింపుకొచ్చాయి.

ఆ తర్వాత వారం రోజులపాటు ప్రతి పాఠశాలా, ప్రతి చిన్నారీ, ప్రతి ఉపాధ్యాయుడూ నాకు మనఃపూర్వకంగా వీడ్కోలు చెప్తూనే ఉన్నారు. అన్నిటికన్నా మరవలేనిది ఆసిఫాబాద్ గురుకులపాఠశాలలో జరిపిన వీడ్కోలు సభ. ఆ రోజు దారిపొడుగునా గులాబీలు పరిచి మరీ నన్ను స్వాగతించారు.

అప్ప్పుడు నాకనిపించిందీ, నేను వారితో చెప్పిందీ ఇదే: ‘ఒకప్పుడు నేను మిమ్మల్ని ఒత్తిడి చేసినప్పుడు మీరు ఆగ్రహించింది మీ మీదనే. ఆ ఆగ్రహాన్ని భరించడానికొక మనిషి కావాలి కాబట్టి నాలో ఆ మనిషిని చూసారు. ఈరోజు మీరు మీలో ఇంతదాకా నిద్రాణంగా ఉన్న శక్తిసామర్ధ్యాలు బయటకు వచ్చినప్పుడు ఆ ఆనందంలో మీరు గర్విస్తున్నదీ, గౌరవిస్తున్నదీ కూడా మిమ్మల్నే. ఆ సత్కారానికి ఒక మనిషి కావాలి కాబట్టి నాలో ఆ మనిషిని ప్రతిష్ఠిస్తున్నారు. రెండు సందర్బాల్లోనూ నాదేమీ లేదు. నేను సాక్షిని, నిమిత్తమాత్రుణ్ణి’.


10

We Shall Overcome

The morning that followed marked a profound awakening in both my personal consciousness and my administrative journey. Around ten o’clock, I stepped onto the campus of the Utnoor Girls’ Ashram School. Golden marigolds were blooming brilliantly in the morning sunlight. The children gathered in their morning classes resembled birds perched quietly along tree branches, and a stillness hung gently in the air.

I walked straight into the headmaster’s office. The moment he saw me, Gangadhar rose eagerly from his seat, welcomed me warmly, and offered me a chair. He looked like a soldier exhausted after fighting a grueling battle the day before; the vibrant cheerfulness and enthusiasm that usually characterized him were entirely absent. Soon after, his colleagues—Sudhakar, Tukaram, and several other teachers—entered the room one by one. They greeted me courteously and stood around us in quiet solemnity.

Looking at them, I sensed a subtle shift. There was no fear in their posture. None of them assumed that the Tribal Welfare Officer had arrived to demand an explanation or penalize them for participating in the previous day’s demonstration. Their eyes betrayed a quiet recognition, as if they already knew I had not come to haunt or confront them.

I sat in silence for a few moments, and the teachers stood quietly alongside me. Soon, someone brought a cup of tea and placed it before me.

What had transpired in those twenty-four hours? It felt as though a quiet miracle had occurred. The storm of the previous day had wrought a deep internal shift within all of us—something entirely unprecedented, beyond anything we could have engineered or anticipated.

Until yesterday, we were bound strictly by institutional roles: they were teachers and employees in the welfare cadre, while I was the supervising officer responsible for their service records, increments, and performance evaluations. In that hierarchical framework, tensions had escalated, boundaries were breached, and the relationship had strained to the brink of snapping altogether. By all logic, the thread should have broken.

Instead, out of the ashes of that conflict, an intimate human bond awoke in place of official distance. We ceased to be an officer and his subordinates; we became a family.

How had this transformation occurred? As I sat reflecting, the truth slowly dawned on me: those very teachers who had marched against me and denounced me on the open road carried a deep, unspoken regard for me in their hearts—a reality they themselves had recognized only during the heat of the protest.

The crisis had suddenly awakened that dormant affection, sweeping away the dust of misunderstanding. I realized that their outburst had not been driven by personal hostility toward me, nor by skepticism toward the educational vision we championed. It had stemmed entirely from a deep-seated, systemic insecurity.

Deep down, every one of those teachers genuinely cherished the comprehensive educational plan we had crafted, and they possessed a sincere, heartfelt willingness to implement it. Perhaps the anger they had directed at me was, in truth, an expression of the frustration they felt toward their own institutional helplessness.

They, too, must have spent a sleepless night, caught in the throes of an intense internal struggle. Just as I had spent hours in painful self-examination wondering how things had gone so wrong, they had undergone their own agonizing soul-searching—confronting themselves without hesitation, fighting an inner battle, and emerging utterly spent. It was the quiet fatigue of that inner reckoning that I observed on the headmaster’s face that morning.

After a brief, meaningful silence, I stood up and took my leave. My heart felt infinitely lighter. My restless eagerness to translate vision into immediate institutional capability had inadvertently sparked conflict, but I left with the deep satisfaction that our journey was ultimately moving toward understanding, harmony, and shared purpose.

That evening, our Project Officer returned from his tour and invited me to his residence. Having received preliminary reports about the previous day’s events, he remarked, “Tell me what disciplinary action you would like me to take against them. I am prepared to impose the most severe penalties.”

My perspective, however, was entirely different.

No matter how negligent a teacher may appear on the surface, at his core, he remains a teacher. However thickly the dust of societal cynicism may settle upon his inherent duty (swadharma), the inner flame continues to burn deep within. Daily life among innocent young children never allows his core humanity to be fully extinguished.

Yet socially and institutionally, the teacher is subjected to relentless insecurity. Our broader society rarely stands ready to uphold his dignity, restore his self-confidence, or offer him a supportive hand. Instead, administrative structures seeking to control, monitor, and enforce compliance abound. Standing vulnerable before those coercive systems, the teacher often feels diminished—and he struggles to forgive himself for that powerlessness.

If a teacher feels compelled to rely on collective union power (Sanghabalam) rather than his individual inner strength (Atmabalam), it is because society and administrative machinery have backed him into that corner. This does not mean that teachers oppose noble ideals or transformative progress. The moment a teacher is assured that reform will respect and elevate his professional self-worth, he will stand at the very forefront, leading the march toward change.

It was true that the teachers had harbored numerous grievances against us. Their chief complaint was that I conducted review meetings late into the night, causing them considerable hardship. Yet, the moment their union issued a call to stage a protest and march against the ITDA administration, those very teachers mobilized by the hundreds, arriving in lorry loads, jeeps, and tractors.

What did that signify? It was certainly not a lack of physical energy, nor an inability to endure hardship, sacrifice, or personal discomfort. They were entirely willing to bear inconvenience—provided they chose to do so out of their own volition. Conversely, when I summoned them for an official review meeting and reimbursed their travel expenses, it felt like an imposed burden. Why? Simply because their hearts were not in it.

Everything hinges on inner conviction (talapu). Once the mind is genuinely engaged, nothing remains impossible. But how is that conviction birthed? It arises only when people view a program not as an external mandate forced upon them, but as their own shared endeavor—when teachers view the institutions where they serve not as cold government schools, but as their schools.

How could we inspire that sense of ownership?

When our Project Officer asked what course we should take, I shared my realization candidly:

Sir, until now, we operated under the assumption that teachers lacked the professional capability to elevate classroom learning, and we focused all our energies on imparting those skills. What I have come to understand is that capability possesses no intrinsic value on its own; its activation depends entirely upon human resolve.

Teachers and educational institutions cannot thrive in a climate of fear. A psychological divide has widened between us and our teaching cadre, and external factions are exploiting that gap to their advantage. We have imparted enough training and enforced enough administrative discipline. It is time for us to transform our own attitude and approach.”

That moment highlighted the rare nobility of Sri Subrahmanyam’s character. He grasped the essence of my reflection instantly, seeing no need for defensive debate or prolonged deliberation. Ready to pivot toward a new framework, he asked directly, Tell me, then—what shall we do tomorrow?”

Together with Professor Sashidhar Rao, we decided to spend the following week conducting direct, open-door town hall meetings with teachers across all taluk headquarters. We set no formal agenda; the sessions were purely face-to-face interactions. We issued a public press statement announcing that any teacher could raise any issue directly with the Project Officer and seek an immediate, constructive resolution to their grievances.

The response to those open forums was unprecedented. It is safe to say that no administrative setup—not even the powerful management structures of the Singareni Collieries dealing with organized labor—had ever hosted dialogue of that nature in the region. I consider those open interactions far more valuable than all our formal training workshops combined.

I realized that our schools were not lifeless because teachers lacked competence, but simply because their spirit had not been touched. Once a teacher’s heart is awakened, external oversight becomes redundant—his own inner conviction drives the institution forward. This was a profound lesson, one that extends far beyond schools and classrooms to apply to any organization or workforce.

A week later, when someone casually mentioned seeing that same headmaster from Raiguda loading fruit saplings onto a tractor at Ichoda to plant at his new assignment in Gadiguda, I was not surprised in the least. His inner resolve had finally caught fire.

Amidst these administrative breakthroughs, two or three joyful milestones unfolded. Prominent among them was a district-level art exhibition we organized for all tribal schools. Hosted at Adilabad under the guidance of Ravindrakumar Sharma and through the dedicated initiative of Prasad, an ashram school headmaster, the event featured the legendary artist P.T. Reddy as our chief guest.

Shri P.T. Reddy was mesmerized by the sheer artistic talent displayed by the Adivasi children. Out of more than three thousand student paintings exhibited, he selected ten as works of international caliber.

Many observers struggled to comprehend the artistic criteria behind his choices. For me, his selections recalled my childhood art master back in Tadikonda, who prioritized artistic perspective over mere technical skill during drawing competitions. It was that very sense of raw, authentic perspective that had captivated P.T. Reddy.

And then, right in the middle of this harmony—amidst this symphony of art, reform, and renewed purpose—my sudden transfer order arrived out of the blue.

Shortly before those orders arrived, our Project Officer had dropped a subtle hint in passing. He mentioned that local opposition to our initiatives remained strong, that the political leadership was feeling the pressure, and that one of us might soon be transferred.

He had assumed that he would be the first to be moved. My transfer came as a complete shock to him. I had served in Utnoor for less than a year and a half, making the order an abruptly premature transfer by any standard. By then, however, I had attained a state of inner detachment and felt no hesitation about accepting the decision.

Yet, unexpectedly, the physical order was never served on me. Our Project Officer refused to hand it over, determined to retain my services at least until the end of the ongoing academic year. He appealed to the District Collector and senior state authorities, but the government responded with firm instructions that the transfer must be executed immediately.

Fearing that the Project Officer might withhold or stall the order, our detractors obtained photocopies of the transfer decree and distributed them widely across town. But that move backfired completely, triggering an unprecedented wave of public outrage.

Teachers, Adivasi elders, students, administrative staff, and townspeople across all walks of life united in protest. All the latent affection and respect that had quietly built up over the months suddenly surged to the surface. Delegations flooded the Project Officer’s office, pleading with him not to relieve me while they prepared to appeal directly to the state government.

A group of teachers announced an indefinite hunger strike until the transfer was revoked. Most remarkably, the very headmaster whose transfer from Raiguda had sparked the union conflict sat on a public fast demanding that my transfer be stayed.

Major newspapers published special feature stories highlighting our contributions to tribal education, and the entire township of Utnoor observed a complete general strike (bandh). Even when illustrious predecessors who had rendered distinguished service were transferred in the past, Utnoor had never shut down. Yet, on this occasion, the Adivasi community simply refused to accept the government’s decision.

My astonishment reached its peak upon learning that the call for the general strike had been issued by student organizations. While every reform I had designed was centered entirely on the welfare of Adivasi children, I had never imagined that the students themselves would grasp the intent behind my work so deeply and rise so resolutely in my support.

Numerous colleagues and well-wishers urged me not to accept the transfer, insisting that I challenge the order before the Administrative Tribunal. That was likely the Project Officer’s silent hope as well. That very night, a representative set off for Hyderabad to file a petition on my behalf.

Before the Tribunal, our legal counsel presented our comprehensive educational blueprint, the minutes of our district review meetings, and the extensive press coverage documenting the public movement against the transfer. Typically, the Tribunal dismisses petitions challenging administrative transfers at the preliminary admission stage itself, adhering to clear Supreme Court directives that judicial bodies should not interfere in routine government transfers.

Upon reviewing the documentation, however, the Tribunal observed that the petition before it presented an extraordinary case. Unwilling to reject it out of hand, the Tribunal set aside the transfer orders and granted a stay.

The Administrative Tribunal directed me to submit a formal representation to the state government requesting to be retained at Utnoor until the conclusion of the academic year, instructing the government to consider the request on its merits.

The moment news of the Tribunal’s order reached us, our Project Officer distributed sweets to the fasting teachers, bringing an end to their hunger strike. It was a moment of pure, shared joy—not merely because a transfer had been stayed, but because the dark clouds that had hovered over our relationship had finally dissolved, pouring down like a gentle rain of pearls.

In accordance with the Tribunal’s direction, I submitted my petition to the government requesting a deferment until the end of the term. The government responded with absolute silence.

Meanwhile, time moved swiftly, and the auspicious month of Pushya drew to a close. Word arrived that the annual Keslapur Adivasi Darbar would be attended not only by state cabinet ministers and senior officials, but also by Project Officers from Integrated Tribal Development Agencies across the entire state. We were thrilled to learn that the visiting officials wished to inspect our schools, as news of the educational experiments at Utnoor had spread across Andhra Pradesh.

We prepared to showcase our key initiatives: the single-teacher school at Marlavai, the specialized sports school at Utnoor, the newly equipped laboratories, the campus libraries, and the transformed ashram schools across the agency.

On the eve of the Darbar, the Project Officer summoned me to his bungalow, where our Departmental Commissioner and visiting Project Officers had gathered. As I entered, Sri Subrahmanyam looked at me with a wry smile and said, I cautioned you about the administration, didn’t I? They are absolutely determined not to let you remain here.”

The government had dispatched an official courier to deliver my transfer orders directly at Utnoor. Hearing this, a deep sorrow settled over me. While I had accepted the first transfer order with quiet detachment, I found it impossible to remain indifferent this time.

What had I done wrong? Why did the government view my presence in Utnoor as such a threat?

A flood of cherished memories rushed through my mind—the Kuntanmanpalli Girls’ School blooming amidst marigolds, the quiet night spent at the Bhupalapatnam Ashram School, dancing the traditional Gusadi with children at Andarband, planting mango saplings along the hills of Movad, reading Tolstoy in the Bheemaram hostel library, and above all, seeking solace at the temple of Gnana Saraswati at Basara. The realization that I had to leave this sacred land pierced my heart with deep grief.

The following morning, we accompanied the Commissioner and visiting Project Officers on a tour of our schools. Early that morning at the Utnoor Sports School, young Adivasi boys and girls stood glowing in the soft sunlight, singing in unison: “We shall overcome, we shall overcome…”

I recalled our Commissioner mentioning that song months earlier during an administrative review, describing how she had been moved to tears hearing thousands of girl scouts sing it at a national jamboree in Bhopal, and wondering if she would ever hear our Adivasi children sing it. Inspired by her memory, I had brought the song to Utnoor, and our music instructors had taught the children to sing it not merely with their voices, but from the depths of their hearts.

As those young Gond and Kolam girls raised their voices in the morning air, singing “We shall overcome, deep in my heart I do believe,” the visiting officers witnessed the soul of the Utnoor experiment. After that moment, no one felt the need to inspect anything further.

By the time the Minister, Commissioner, and officials gathered at the Keslapur Darbar, news of my transfer had spread throughout the venue. Adivasi elders took the microphone one by one, appealing to the government to cancel the transfer. Even Sri Godam Rama Rao—a former Tribal Welfare Minister and a revered teacher in his earlier life—made an impassioned plea on my behalf.

The Minister offered no response. The Commissioner intervened to explain that my services were urgently required in the Visakhapatnam tribal belt, making the transfer unavoidable.

Afterward, the Commissioner accompanied me to the nearby ashram school. Along the way, she gently remarked that transfers were an integral part of public service and advised me to take the decision in a sportive spirit—perhaps fearing that I might seek judicial intervention once again. I assured her that I had not sought a court stay out of personal ambition, and that I would obey the government’s transfer orders without hesitation.

The Darbar concluded. Our Project Officer was proceeding on two weeks of personal leave immediately following the event. Embracing me warmly, he said, God has spared me the painful duty of serving your transfer order myself.” In that tender moment of parting, the ancient Valmiki verse echoed in my mind:

“Tam tu desam na pashyami yatra bhrata sahodarau…” (I see no land where one can find a true brother born of the same womb…)

Thus, the journey of educational vision and collective effort that had commenced at Keslapur came to its natural, poetic completion at Keslapur itself.

Over the following week, every school, every child, and every teacher gathered to bid me a heartfelt farewell. Most unforgettable was the ceremony organized by the residential school at Asifabad, where the staff and students had carpeted the entire pathway with fresh rose petals to welcome me.

Standing before them, I shared the realization that had settled deep within my soul:

“When I pushed you hard in the beginning, the anger you felt was not truly directed at me, but at yourselves. Because human nature requires a visible figure upon whom to project that frustration, you saw that figure in me.

“Today, as your dormant capabilities have awakened and blossomed, the joy, pride, and respect you feel is truly a celebration of your own inner strength. Because such a celebration requires a person to honor, you are bestowing that honor upon me.

“In truth, my role in both instances was negligible. I was merely a witness, an instrument (nimittamatra) in a larger unfolding.”

3-8-2026

5 Replies to “కొన్ని కలలు కొన్ని మెలకువలు-26”

  1. ఉపాధ్యాయుడికి సామర్ధ్యం కొరవ అయినందువల్ల కాక, అతని మనసును తట్టిలేపనందువల్ల మాత్రమే పాఠశాలలు నిస్తేజంగా ఉన్నాయని నాకు బోధపడింది. ఒకసారంటూ అతడి మనసుని స్పృశించి మేల్కొల్పాక ఇక తక్కినవారు చెయ్యవలసి దంటూఏమీ ఉండదు. అదంతా తన మనోబలంతో ఉపాధ్యాయుడే నడుపుకుంటూ పోగలుగుతాడు.

    ఉత్నూరులో ఉపాధ్యాయుల మనసును తట్టిలేపారు.

  2. “సామర్థ్యం దానికదే విలువ కాదు. అది తిరిగి సంకల్పం మీదనే ఆధారపడుతుంది.”

    “ఉపాధ్యాయుడికి సామర్థ్యం కొరవ అయినందువల్ల కాక, అతని మనసును తట్టిలేపనందువల్ల మాత్రమే పాఠశాలలు నిస్తేజంగా ఉన్నాయని నాకు బోధపడింది.”

    ఉపాధ్యాయ సంఘాలు చేసిన ధర్నాలను mere resistance to change గా మాత్రమే చూడకుండా దాని వెనుక వున్న insecurity, self-respect, trust వంటి అంశాలను గమనించి, అర్ధం చేసుకుని వారి సమస్యలను వినడానికి తాలూకా కేంద్రాలలో ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి
    వారు మనోబలం తో ముందుకు సాగడానికి మీరు చేసిన ప్రయత్నాలు shows what a true leader is like, Sir!!

    “రెండు సందర్భాల్లోనూ నాదేమీ లేదు. నేను సాక్షిని, నిమిత్తమాత్రుణ్ణి.”

    ఒకప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించినవారే, తర్వాత మిమ్మల్ని గౌరవించారు.
    కానీ ఆ రెండింటినీ personal తీసుకోకుండా, వాటి వెనుక ఉన్న human nature ని అర్థం చేసుకుని, మీ పాత్రను “సాక్షి, నిమిత్తమాత్రుడు” గా మాత్రమే చూడగలగడం possible only for an evolved person!
    🙇🏻‍♀️🙏🏽

  3. సామర్థ్యం సంకల్పమైతేనే సాధించగలం మన ఆశయాలు అవసరాలు…
    కానీ ఇది అంత త్వరగా అర్థమవగలదా🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading