ఒక భాష బృహద్భాషగా పరిగణించబడాలంటే ఆ భాషలో గొప్ప సాహిత్యం వచ్చి ఉండాలనేది మళ్ళీ చెప్పవలసిన పనిలేదు. కాని, మనం కొత్తగా చెప్పుకోవలసిందేమంటే, ఆ సాహిత్యాన్ని ఆ మూలభాషలో చదవడానికి ఆసక్తి చూపించేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగాపెరుగుతూ వస్తేనే ఆ భాష ప్రపంచభాషగా మారుతుందనేది
హాన్ షాన్
ఆయన్ని చివరిసారి కొండలమీదనే చూసారనీ, ఒక కొండనెర్రె విచ్చుకుని అందులోనే ఆయన అదృశ్యమైపోయాడనీ ఐతిహ్యం. ఒక్కటి మటుకు స్పష్టం. కవీ, కొండా ఒకటైపోయిన ఇటువంటి ఉదాహరణ ప్రపంచసాహిత్యంలోనే మరొకటి లేదు.
రెండు వీపుల పశుపతి
ప్రతి క్రతువూ ఒక ప్రతీకాత్మక పశువధ. ఆ పశువు బయటి పశువుగా ఉంటూనే లోపలి పశువుని కూడా సంకేతించడంలోంచే పురాణగాథలు పుట్టుకొచ్చాయి. ఆ పశువు ఒకటే పశువైతే మినోటారు, దానికి పదిముఖాలుంటే రామాయణం, వందముఖాలుంటే భారతం.