ఆషాఢమేఘం అనగానే కాళిదాసు మేఘసందేశం గుర్తుకు రావడం సహజం. ఈ దేశంలో కవులకీ, భావుకులకీ శతాబ్దాలుగా ఒక అభిరుచిని అలవరచడంలో, ఋతుపవనాన్ని ఒక శుభాకాంక్షగా మనం గుర్తుపట్టేలా చెయ్యడంలో మేఘసందేశ కావ్యం పోషించిన పాత్ర చిన్నది కాదు. కాని ఋతుపవనాన్ని ఒక కావ్యవస్తువుగా స్వీకరించడంలో, మనుషుల హృదయాల్ని మెత్తబరచడంలో, నింగినీ, నేలనీ ముడిపెట్టడంలో మేఘసందేశం తొలికావ్యం కాదు.
ఆషాఢమేఘం-1
ఆషాఢ మేఘం ఒక సూచన, ఒక ధ్వని. ఏకకాలంలో భూమీ, ఆకాశమూ కలుసుకునే చోటు అది. భావుకుడైన ప్రతి మానవుణ్ణీ ఈ ప్రపంచమూ, మరో ప్రపంచమూ రెండూ ఒక్కసారే పిలుస్తున్నప్పుడు అతడు లోనయ్యే ఉద్విగ్నతకు అద్దం పట్టే దృశ్యమది.
ఊర్వశీయం
ఈ నాటకం పైకి కనిపిస్తున్నంత సరళంగానూ సులభంగాను ఉన్న కథ కాదనీ, ఈ నాటక ఇతివృత్తంలో సార్వజనీన, సార్వకాలిక సమస్యలు లోతుగా సంక్లిష్టంగా ఉన్నాయని ఓల్గా గారు అన్నారు.
