మధురవిషాద మోహగాథ

నా దృష్టిలో విక్రమోర్వశీయం కావ్యం. అందమైన, సుకుమారమైన దీర్ఘకవిత. చింగిజ్ ఐత్ మాతొవ్ రాసిన జమీల్యా లాగా అది విషాదమాధుర్యాలు కలగలిసి, చివరికి, మాధుర్యమే మనల్ని వెన్నాడే ఒక మోహగాథ.

ఏనీడ్ -2

ఎందుకంటే ఏనీడ్ లో కథానాయకుడు తన ప్రయాణంలో భాగంగా నరకలోకానికి కూడా వెళ్తాడు. నరకం ఎలా ఉంటుందో వర్జిల్ కి తెలుసు. నరకం గురించి హోమర్ కి కూడా తెలుసు. ఓడెస్సీలో ఒడెస్యూస్ కూడా నరకంలో అడుగుపెడతాడు. కాని హోమర్ చూసిన నరకం వేరు. వర్జిల్ చూసిన నరకం వేరు.

దశార్ణదేశపు హంసలు

'ఆ హంసలక్కడ ఉండేది కొన్నాళ్ళే'. ఈ వాక్యం చిన్నప్పణ్ణుంచి చదువుతున్నాను. కాళిదాసు ఈ మాట దశార్ణదేశపు హంసల గురించి రాసాడనే అనుకున్నాను ఇన్నాళ్ళూ. ఇప్పుడు తెలుస్తోంది, ఆ హంసలు నా ప్రాణాలేనని' అన్నారాయన తన డెబ్బై ఏళ్ళ అస్వస్థ శరీరాన్ని చూసుకుంటో.