ఆషాఢ మేఘం-19

కాని మేఘసందేశంలోని రసఝురి ఇక్కడే ఉంది. వసంతపవనంతో సందేశం పంపి ఉంటే అది తనకీ, తన భార్యకీ మాత్రమే సంబంధించిన శుభవార్త అయి ఉండేది. కాని ఋతుపవన మేఘం సమస్తలోకానికి కల్యాణప్రదం. ఆ మేఘాన్ని చూడగానే కడిమి పుష్పిస్తుంది. బలాకలు సంతోషంతో ఎగురుతాయి. ఆ మేఘగర్జన వినగానే పుట్టగొడుగులు నిద్రలోంచి మేల్కొంటాయి. రైతులు నాగళ్ళు భుజాన వేసుకుని వ్యవసాయం మొదలుపెడతారు.

ఆషాఢ మేఘం-18

తక్కిన కాళిదాసు రచనలన్నీ అలా అట్టేపెట్టి, మేఘసందేశంలో మాత్రం కాళిదాసు ఈ కవిత్వాలన్నిటినీ కలిపి ఒక రసమిశ్రమం రూపొందించాడు. కాబట్టి చాలాసార్లు ఆ పాఠాన్ని బోధిస్తున్న గురువులకు తెలియకపోయినా, ఆ కావ్యపాఠాన్ని వల్లెవేస్తూ ఉన్న విద్యార్థులకు తెలియకపోయినా, మేఘసందేశం ద్వారా వారు అత్యుత్తం ప్రాకృత, తమిళ భావధారలను తాము అస్వాదిస్తోనే వచ్చారు.

ఆషాఢమేఘం-11

ముల్లైప్పాట్టు ఒక సాధారణ ప్రణయ కవిత స్థాయి నుంచి ఒక శుభాకాంక్షగా మన కళ్ళముందు ఎదిగిపోతుంది. మేఘసందేశంలో కాళిదాసు ప్రణయవార్తకీ, శుభాకాంక్షకీ మధ్య సరిహద్దుని చెరిపేసాడని టాగోర్ అంటున్నప్పుడు, కాళిదాసుకన్నా ఎంతో కాలానికి పూర్వమే ఒక ప్రాచీన తమిళ కవి ఆ పని చేసాడని ఆయనకు తెలీదు!