కాని ఆ చివరి మాటలు ఏసువి కావనీ, ‘ఏలీ ఏలీ లామా సబ్బాచేతానీ’ అనే ఆ అరమాయిక్ పదాలు పాతనిబంధనలోని కీర్తనల్లో 22 వ కీర్తనలోని ప్రథమ పంక్తి అని తెలిసినప్పుడు నాకు గొప్ప కుతూహలం కలిగింది. ఆ కీర్తన మొత్తం చదివాను
యత్ర విశ్వం భవతి ఏక నీడమ్
టాగోర్ శాంతినికేతనం స్థాపించినప్పుడు ఆ భవనం మీద 'యత్ర విశ్వం భవతి ఏక నీడమ్' అని రాసిపెట్టుకున్నాడు. అంటే ఎక్కడ సమస్త విశ్వమూ ఒక గూడుగా మారుతుందో అటువంటి చోటు కావాలి తన పాఠశాల అని అనుకున్నాడాయన. తుమ్మపూడిలో సంజీవ దేవ్ గారింట్లో నాకు ఆ వాక్యమే పదే పదే గుర్తొస్తూ ఉంది. అక్కడ సమస్త విశ్వమూ ఒక కులాయంగా మారింది.
చెప్పకుండా వెళ్ళిపోయాడు
సుమనశ్రీ వెళ్ళిపోయాడంటే సాహిత్యం గురించో, కవిత్వం గురించో రాయకుండా ఇదంతా ఎందుకు రాస్తున్నాని అనిపిస్తోంది కదూ! ఎందుకు సాహిత్యం? కవిత్వం? ఎందుకు అన్నేళ్ళ పాటు అన్నేసి గంటల పాటు కవిత్వం గురించి మాట్లాడుకుంటూ గడపడం? ఒక మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు పక్కన లేకపోయాక నీ స్నేహాలకీ, నీ సాహిత్యానికీ ప్రయోజనమేముంది?
