మొదటి ప్రశ్న వెయ్యడం వరకే నేను చేసింది. ఆ తర్వాత ఒకదాని వెనక ఒకటి ఆ సంగతులన్నీ గోదావరి ప్రవాహంలాగా ఆయన్నుంచి పొంగిపోతూనే ఉన్నాయి.
వెంకటరత్నం మాష్టారు
ఆయన మాష్టారి క్లాసు ఆద్యంతం ముగ్ధుడైపోయి విన్నాడు. తాను ఆ పాఠ్యాంశాలు ప్రవేశపెట్టినందుకు గర్విస్తున్నానని చెప్పాడు. అదొక అపురూపమైన దృశ్యం. నాకు తెలిసి, అంతకు ముందు ఎలానూ జరగలేదు, కనీసం ఈ యాభై ఏళ్ళల్లో మళ్ళా అటువంటి సంఘటన మన పాఠశాలల్లో జరిగినట్టు నేను వినలేదు!
సచ్చిదానందమూర్తి-2
సత్యాన్ని అవగతం చేసుకోవాలనుకున్నవాళ్ళు వీలైనన్ని పార్శ్వాల్తో పరిచయం పెంచుకోవాలి. బహుళమతానుయాయుల్ని సంప్రదించాలి. ఆ పద్ధతిలో నీకు సత్యం చేజిక్కినా చేజిక్కకపోయినా, ముందు నువ్వు సహజీవనానికి అవసరమైన సహిష్ణుత నేర్చుకోగలుగుతావు.
