ఒక రచయిత పుస్తకాల స్టాలు పెట్టుకుని అక్కడికి వచ్చే పాఠకుల్ని స్వాగతించడం ఒక అనుభవం. ఇంత విజువల్ మీడియా రాజ్యమేలుతున్నా, ఇందరు సినిమాతారలు ఇన్ని లక్షలమంది అభిమానుల్ని ఆకర్షించగలుగుతున్నా, ఇంకా, ఒక రచయితని చూడగానే మెరిసే కళ్ళతో అతడితో ఒక ఫొటో దిగాలని కోరుకునే పాఠకుల్ని నేను ప్రతిరోజూ పదుల సంఖ్యలో చూసాను. ..
రాజమండ్రి డైరీ, 1986
ఒకప్పుడు రాజమండ్రిలో సాహితీవేదిక అనే సాహితీబృందం ఉండేది. ఆ సంస్థ 1980 డిసెంబరు 25 న ఏర్పాటయింది. ఆ రోజుని గుర్తుపెట్టుకుని గతమూడేళ్ళుగా అప్పటి మిత్రులు డిసెంబరు 25 నాడు రాజమండ్రిలో కలుస్తూ ఉన్నారు. ఈ ఏడాది కూడా గౌతమీ గ్రంథాలయంలో మళ్ళా కలుసుకున్నారు. ఆ సందర్భంగా నా పుస్తకాలు రెండు ఆవిష్కరణకు నోచుకున్నాయి.
దేవలోకపు విరజాజులు
వర్ష ఋతువు ముగిసేలోపే ఇలా ఆ మున్నీరు ఒక సహృదయాకాశపు మిన్నేరుగా మారి తిరిగి పన్నీరుగా కురుస్తుందని అనుకోలేదు. ధన్యవాదాలు చిన్నమాట మానసా! ఇలా ఒక్కరు చదువుతున్నా కూడా ప్రపంచ సాహిత్యమంతా తీసుకొచ్చి కుమ్మరించాలనిపిస్తుంది.
