మహోన్నత కళా తపస్వి

ఒకసారి సీతానగరం సత్యాగ్రహ ఆశ్రమానికి వెళ్తూ గాంధీజీ రాజమండ్రిలో భగీరధిగారి చిత్రలేఖనప్రదర్శన ప్రారంభించారని తెలియడమే ఒక సంతోషం. అటువంటిది ఆయన భగీరధి గీసిన ఒక లాండ్‌స్కేప్‌ చూసి, ఆ చిత్రంలో కనిపిస్తున్న మంచుకి, తనకి చలి పుడుతున్నదని చెప్పారంటే, అంత సత్యసంధుడి నోటివెంట అంత ప్రశంస వెలువడిందంటేనే ఆ చిత్రకారుడి కౌశల్యమెటువంటిదో మనం ఊహించవచ్చు.

ఇది కదా భారతదేశం

అలా భారతదేశపు నలుమూలలకూ చెందిన చిత్రకారులు మరో ధ్యాసలేకుండా తాము చూస్తున్న దేశాన్నీ, సమాజాన్నీ, సౌందర్యాన్నీ చిత్రించడంలోనే తలమునకలుగా ఉండే ఆ దృశ్యాన్ని చూస్తుంటే, మాకు 'ఇది కదా భారతదేశం' అని అనిపించింది. ఎప్పట్లానే ఈ జాతీయ చిత్రకళా ప్రదర్శన కూడా నాకు మరొక discovery of India గా తోచింది.

శిలానిశ్శబ్దం

కాని సమయం చాలా తక్కువ ఉండటంతో ముందు గాలరీలోకే పరుగులాంటి నడక సాగించాను. ముందు సుడిగాలిలాగా రెండు గాలరీలూ ఒక చుట్టు చుట్టేసాను. నా నమ్మకం వమ్ము కాలేదు. ఈ మధ్యకాలంలో మన చిత్రకారుల చిత్రకళాప్రదర్శనలో నేను చూసినవాటిలో దీన్ని అగ్రశ్రేణి ప్రదర్శనగా చెప్పాటానికి నాకేమీ సంకోచం లేదు.