19 వ శతాబ్ది చివరిలోనూ, ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలోనూ తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు (1862-1915) నిర్వహించిన పాత్ర వంటిది, ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యంలో ఎవరు నిర్వహించారని చూస్తే, ఇద్దరు రచయితలు కనిపిస్తారు. ఒకరు, పాల్ లారెన్స్ డన్ బార్ (1872-1906) మరొకరు, విలియం ఎడ్వర్డ్ డుబ్వా (1868-1963).