సమకాలీన భారతీయ దార్శనికుల్లో అగ్రేసరుడైన డా.కొత్త సచ్చిదానందమూర్తి వేదాలను అర్థం చేసుకోవడానికీ, వ్యాఖ్యానించడానికీ చేసిన ప్రయత్నం ఈ పుస్తకం. వేదాలపై ఇంతదాకా వచ్చిన ఆధునిక భారతీయ, పాశ్చాత్య వ్యాఖ్యానాల గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు, అయినప్పటికీ, ఆయన వేదాలను అర్థం చేసుకోవడం కోసం ప్రధానంగా నిరుక్తం వైపూ, పూర్వ ఉత్తర మీమాంసల వైపూ, స్మృతి, ఇతిహాస, పురాణాల వైపూ, సాయణుల వైపూ, ఇతర భాష్యకారుల వైపూ మొగ్గు చూపడం ఈ రచనలో విశేషం.