నేనేమో చాలా చింతలో ఉండేవాడిని- ఎలా బతకాలి, ఏం చేయాలని. కానీ ఆ సంఘటన జరిగిన రోజు నాకు నమ్మకం కుదిరింది. ప్రపంచంలో పుట్టాము అంటే బతికేస్తాం ఎలాగోలా! పుట్టించినవాడే ఆలోచిస్తాడు, మనకెందుకు చింత అని. నేను పూర్తిగా ప్రశాంతంగా అయిపోయాను. మనసు ప్రశాంతమైన కొన్ని రోజులకే బరోడా వదిలేసి వచ్చేశాను.
జీవనశిల్పి-2
వాళ్ళంతా చాలా సరదా మనుషులు. పేదవాళ్ళు. అన్నీ కోల్పోయిన వాళ్ళు. కాని మానసికంగా మాత్రం వాళ్ళు నిర్వీర్యం కాలేదు. వాళ్ళల్లో ఒక ఔన్నత్యం, ఒక గరిమా ఉండేవి. ఆ గరిమ వాళ్ళకి వాళ్ళదగ్గరున్న జాన్ కారీ వల్ల వచ్చింది. ..
గురూజీ మాటలు మరికొన్ని
నేనా రోజు ఆ అర్థశాస్త్రవేత్తలకి ఆ కథంతా చెప్పి ' ఈ దేశంలో బీదరికం ఎవరి పాపం అని అడుగుతున్నారు కదూ. ఈ ఘోరాన్ని చూస్తూ తలకొక మాటా మాట్లాడుతున్న మీదే ఈ పాపమంతానూ' అన్నాను.
