విశాలమైన మైదానం మరొక మహావిశాలమైన మైదానంలో కలసిపోతున్నట్లుగా పల్చగా పరుచుకున్న గోదావరి మహాసాగరంలో సంగమించే అపురూప దృశ్యం, ఎటుచూసినా అపారజలరాశి తప్ప, మరేమీ కనిపించని ఆ దృశ్యాన్నీ, ఒకటొకటిగా ఈ మహాశిఖర చరణాల చెంత బొట్లుబొట్లుగా పడుతున్న ఈ జలదృశ్యాన్నీ మనసులో పక్కపక్కన పెట్టి పోల్చుకోవడానికి ప్రయత్నించాను.
కొత్తగోదావరి
కానీ ఈ కవికి కాలం గురించిన స్పృహ ఉంది. ఇప్పటి కాలం నలభయ్యేళ్ళ కిందటిలాగా లేదనీ, ఇది ‘గాజు ఆవహించిన కాలం’ అనీ అతడికి తెలుసు. ‘బొటనవేలు తప్ప శరీరమంతా నిరుపయోగమైపోయింద’ని కూడా తెలుసు. కానీ, ఆ సౌకుమార్యానికీ, ఆ ‘సరస్వతీ హ్రదపు జ్ఞాపకానికీ’ అతడు దూరం కాలేదు.
ఆషాఢమేఘం-14
ఒక విమర్శకుడు రాసినట్టుగా, 473 మంది సంగం కవులున్నారంటే, 384 మంది గాహాకోశ కవులున్నారంటే, ఆ కాలాలు, ఆ సమాజాలు ఎంత రసనిష్యందితాలయి ఉండాలి!
