అది తెలుగులో మొదటి యాత్రాకథనం. రామాయణ, మహాభారతాల్ని వదిలిపెడితే, భారతీయ భాషాసాహిత్యాల్లో అటువంటి తీర్థయాత్ర కథనం మరొకటి కనిపించదు. అది తెలుగు కథనం మాత్రమే కాదు, అందులో గీర్వాణ, కర్ణాట, తమిళ, మహారాష్ట్ర దేశాల భక్తుల కీర్తనలు కూడా ఉన్నందువల్ల భారతీయ సాహిత్యంలోనే మొదటి బహుభాషా యాత్రాకథనం కూడా.