ఒకసారి శ్రీవేంకటనాథుడు తెలుగు కవుల్ని ఆకర్షించడం మొదలుపెట్టాక అన్నమయ్య వంటి మహాభక్తుడూ, శ్రీకృష్ణదేవరాయల వంటి చక్రవర్తి మాత్రమే కాదు, మరెందరో కవులు తుమ్మెదలై ఆ పద్మనాభుడి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నారు.
తెలుగువాడి గుండెచప్పుళ్ళు
తరిగొండ ప్రసన్న నరసింహస్వామి గుడి ముంగిట నిల్చుని మరొకసారి వెంగమాంబకు మనసారా నమస్సులర్పించాను. కొందరి దృష్టి చరిత్ర మీద ఉంటుంది, చరిత్ర నిర్మించడం మీద ఉంటుంది. మరికొందరి దృష్టి చరిత మీద ఉంటుంది. తమని తాము సంస్కరించుకునే ప్రయత్నంలో తమకు తెలియకుండానే వారు కొత్త చరిత్ర సృష్టిస్తారు. వెంగమాంబ రెండవతరహాకి చెందిన మనిషి, కవి.
పెదకళ్ళేపల్లి
ముప్పై ఏళ్ళు పైబడి ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. కాని తనకి వచ్చిన అర్జీ మీద ఒక పద్యంతో ఎండార్స్మెంటు రాయవచ్చునని తెలిసినవాడు నాతో సహా ఒక్క అధికారి కూడా లేడు!
