ఒక్క మహాప్రస్థానగీతాల్లోనే, మనిషి తనతో తాను తలపడటం, మరొకవైపు జీవితపు చేదునిజాల్తో సమానంగా చిత్రణకు వచ్చినందువల్లే దీన్ని ‘కవిచేసే అంతర్ బహిర్ యుద్ధారావం’ అన్నాడు చెలం. మహాప్రస్థానం తర్వాత మరొక మహాకావ్యం తెలుగులో ఇంతదాకా రాకపోవడానికి ఇదే కారణమనుకుంటాను.
పుస్తక పరిచయం-28
పుస్తక పరిచయం ప్రసంగ పరంపరంలో భాగంగా కాళిదాసు మేఘసందేశం పైన చేసిన ఏడవ ప్రసంగం. ఈ ప్రసంగంలో ప్రధానంగా 'పశ్చాదుచ్చైర్భుజతరువనం మండలేనాభిలీనః' అనే శ్లోకాన్ని వివరిస్తూ రసధ్వనిని దాటిన కాళిదాసు కవిత్వ లక్షణాల గురించి కొంత వివరంగా చర్చించాను.
కథలు ఎలా పుట్టాయి
చాలా సంతోషంగా ఉంది. పదిహేనేళ్ళ కిందట మొదలుపెట్టిన ప్రాజెక్టులో మొదటిభాగాన్ని ఇప్పటికి సంతృప్తిగా పూర్తిచేయగలిగాను. 'కథలు ఎలా పుట్టాయి: ప్రాచీన కథారూపాల పరిచయం' అనే ఈ పుస్తకాన్నిలా ఈ-బుక్కుగా మీ చేతుల్లో పెట్టగలుగుతున్నాను.
