ముప్పై ఏళ్ళల్లో

తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించి ముఫ్పై ఏళ్ళయిన సందర్భంగా, ముఫ్ఫైఏళ్ళ (1985-2015) తెలుగు సాహిత్యం మీద ఒక గోష్టి ఏర్పాటు చేసారు. అందులో కీలకప్రసంగం చేయవలసిందిగా మృణాళిని నన్నడిగారు. 

ఒక ఊహాగానం

కవిత్వాన్ని తులనాత్మకంగా పరిశీలించడం ఎందుకు, ఎట్లా? తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడి ముప్పై ఏళ్ళయిన సందర్భంగా తులనాత్మకసాహిత్యకేంద్రం వారొక సదస్సు నిర్వహించారు. అందులో కవిత్వ తులనాత్మక పరిశీలన గురించి మాట్లాడమని మిత్రుడు శిఖామణి నన్నాహ్వానించాడు.

స్టీలూ, పూలూ 

ఈ రోజు కాకినాడలో ఇస్మాయిల్ మిత్రులంతా కలుసుకుంటారు. ఆయన్ని తలుచుకుంటారు. ఆయన పేరు మీద ఈ ఏడాది యాకూబ్ రాసిన కవిత్వాన్ని గౌరవించుకుని దానిమీద కూడా మాట్లాడుకుంటారు. నేనూ అక్కడుండాలి, కానీ వెళ్ళలేకపోయాను. అయినా కూడా, వాళ్ళ మాటల్లో, నలుగురూ కూచుని నవ్వుకునే ఆ వేళల్లో నేను కూడా ఉన్నాను.