భూషణంగారు రాసిన ఈ 'రుణం' కథ మళ్ళా చదవడంతో. ఇది కథనా? కాదు, chronicle. అత్యంత సత్యసంధుడైన ఒక మానవుడు అక్షరబద్ధం చేసిన ఒక ఆత్మచరిత్రశకలం. పోరాటాలు చేసేవాళ్ళూ, విప్లవాలు కోరుకునేవాళ్ళూ, ప్రజల మేలుకోరేవాళ్ళూ ఎలా ఆలోచిస్తారో, ఎలా నడుస్తారో, ఎలా జీవిస్తారో, ఈ కథలో ప్రతి అక్షరం ఒక నిరూపణ.
ట్రివియం
కానీ, ఆ గ్రీకు గ్రంథాల్ని మధ్యయుగాల విద్యార్థులు ఏ పద్ధతిలో చదివారు? వాటిని వారికెవరు బోధించారు? ఏ బోధన-అభ్యసన ప్రక్రియ వల్ల లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, బొకాషియో, డాంటే, షేక్ స్పియర్, గెలీలియో, బ్రూనో లు రూపొందారు? ఏ విద్యాబోధన పునాదులమీద తదనంతర కాలాల్లో ఫ్రాన్సిస్ బేకన్,న్యూటన్, వోల్టేర్, డెనిస్ డిడిరో, గొథే, సెర్వాంటిస్ లు ప్రభవించగలిగారు?
సాహిత్యవేత్త
శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తికి మనం సమకాలికులం కావడం మన అదృష్టమని భావిస్తాను. నేను ఎటువంటి సాహిత్యవేత్తకోసం అన్వేషిస్తుంటానో, అటువంటి సాహిత్యసహృదయుడు ఆయన.
