చంద్రశేఖరరావు

ఎంతో సౌజన్యం, మృదుత్వం కూడుకున్న మనిషి, అతడు మాట్లాడుతుంటే, మల్లెతీగమీంచి పువ్వులేరుతున్నంత కుశలంగానూ, సున్నితంగానూ ఉండింది. ఒక కవినో, రచయితనో చూస్తుంటే, ఇప్పుడే దేవలోకంలోంచి దిగారా అన్నట్టు ఉంటుంది అన్నారొక సాహిత్యాభిమాని ఒకప్పుడు. ఆ రోజు చంద్రశేఖరరావు ని చూస్తే నాకట్లానే అనిపించింది

సాహితీవేత్త

బహుశా శ్రీ శ్రీ తర్వాత తెలుగులో శబ్దానికి అంత ప్రాధాన్యతనిచ్చిన కవి నారాయణరెడ్డి అనే అనిపిస్తున్నది. శబ్ద ప్రయోగ రహస్యం తెలిసినవాడు కాబట్టే ఆయన సినిమా పాటలు అంతగా జనాదరణ పొందేయి.

సాంస్కృతిక రాయబారి

ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాల పట్ల ఆమె అధికారం మనల్ని నివ్వెరపరుస్తుంది. ఆమె మనోవేగంతో సాహిత్యప్రశంస చెయ్యగలరు. ఏ సాహిత్య విశ్లేషణలోనైనా మనం చివరి మాట చెప్పాం అనుకున్నప్పుడు, ఆ తర్వాత మాట ఆమెదే అవుతుంది.