ఉత్తమ తెలుగు వాన కథలు

తక్కిన ప్రపంచమంతా తనని తాను కులాల, మతాల, సిద్ధాంతాల గొడుగుల్తో మానవతావర్షధారలనుంచి అడ్డుపెట్టుకుని తప్పించుకుంటున్నప్పుడు కథకుడొక్కడే ఆ వానలో అమాయికంగానూ, సాహసంగానూ ముందడుగు వేస్తున్నాడు.

స్వర్ణ యుగద్వారం

పదిహేడేళ్ళ బాలిక రాసిన ఆ నాలుగు కవితలూ చదవగానే నాకొక సారి మళ్ళా ఏ గ్రీకు సముద్రతీరంలోనో, ఏ పార్థెనాన్ మంటపం దగ్గరో, ఏ ఒలింపియా ప్రాంగణంలోనో తిరుగుతున్నట్టు అనిపించింది. ఆ ఇంగ్లీషు మామూలు ఇంగ్లీషు కాదు, ఆ భాషని అంటిపెట్టుకున్న క్లాసికత నన్నాశ్చర్యపరిచింది.

పన్నువసూలు చేసే పాండురంగడు

భక్తి కవులే లేకపోతే భారతదేశం ఊపిరాడనంత మతమౌఢ్యంలో కూరుకుపోయి ఉండేది. భక్తి కవులే లేకపోతే దేవుడు ఒక విగ్రహంగా, ఒక చిహ్నంగా, ఒక పతాకంగా, ఒక క్రతువుగా మాత్రమే మిగిలిపోయి ఉండేవాడు. భక్తి కవుల వల్ల మాత్రమే భారతీయ భావోద్వేగాలు సంగీతమయంగా, సంతోషమయంగా, సహజీవనయోగ్యంగా వ్యక్తీకరణకు నోచుకోగలిగేయి.