ఆయనెప్పుడూ అనేవారు: 'ఈశ్వరుడి గురించి కాకపోతే ఏ మాటలైనా వృథా. ఇక ఈశ్వరుడి మాటలెట్లానూ బిగ్గరగా మాట్లాడుకునేవి కానేకావు.'
సాహిత్య విలాసం
ఒక జమీందారుగా టాగోర్ తూర్పు బెంగాల్ నుంచి ఒరిస్సాదాకా ఉన్న తమ భూములూ, ఎస్టేట్లూ చూసుకోవడానికి చేసిన ప్రయాణాల్లో రాసిన ఉత్తరాలవి. నదులూ, సరసులూ, మైదానాలూ, గ్రామాలూ, సూర్యాస్తమయాలూ, వెన్నెలా, మబ్బులూ, వర్షాల మధ్య రాసుకున్న ఉత్తరాలవి.
చైనాను చూపించే కథలు
ఒక మామూలు సమాజంలో, చిన్ని చిన్ని ఆశలు, నిరాశలు, త్యాగాలు, మోహాలు, మోసాలతో కూడుకుని ఉండే జీవితమే, ప్రపంచంలో తక్కిన ప్రతి చోటా ఉండే జీవితమే అక్కడ కూడా దర్శనమిస్తుంది. కానీ ఆ సాధారణ సుఖదుఃఖాలకు ఆ ప్రజలు లోను కావడంలో, ఆ దేశానిదే అయిన అద్వితీయ లక్షణమేదో ఉంది. ఆ కథలు దాన్నే పట్టుకున్నాయి, చిత్రించడానికి ప్రయత్నించేయి.
